Plane Crash: మహారాష్ట్ర బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar)తో పాటు మొత్తం ఐదుగురు మృతి చెందడం రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ప్రమాదం రన్వేకు చాలా దగ్గరగా జరిగిందని, కళ్లారా చూసిన వారు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షుల మాటల ప్రకారం, విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే నియంత్రణ కోల్పోయినట్టు కనిపించింది. రన్వేకు సుమారు 100 అడుగుల దూరంలో విమానం ఒక్కసారిగా నేలను ఢీకొని పేలిపోయిందని వారు చెప్పారు. విమానం కూలిన వెంటనే భారీ శబ్దంతో పేలుడు జరిగి, చుట్టూ మంటలు చెలరేగాయని తెలిపారు.
ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, “విమానం దిగుతున్నప్పుడే ఏదో తప్పు జరుగుతోందని అనిపించింది. క్షణాల్లోనే అది కూలిపోయి పెద్ద పేలుడు జరిగింది. ఆ తర్వాత మరో నాలుగు నుంచి ఐదు సార్లు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి” అని చెప్పారు.
ప్రమాదాన్ని చూసిన వెంటనే స్థానిక ప్రజలు సంఘటన స్థలానికి పరుగులు తీశారు. విమానంలో ఉన్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నించామని, కానీ మంటలు చాలా ఎక్కువగా ఉండటంతో ఎవరినీ రక్షించలేకపోయామని మరో ప్రత్యక్ష సాక్షి వాపోయాడు. “మంటలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దగ్గరకు వెళ్లడం కూడా కష్టమైంది” అని తెలిపారు.
ఒక స్థానిక మహిళ మాట్లాడుతూ, పేలుడు సమయంలో విమానం ముక్కలు గాల్లోకి ఎగిరి తన ఇంటి దగ్గర పడినట్లు చెప్పారు. “విమానం రన్వే వైపు వస్తుండగా కొంచెం ఒరిగినట్టు కనిపించింది. వెంటనే నేలను బలంగా ఢీకొట్టి పేలిపోయింది. ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంది” అని ఆమె వివరించారు.
ఈ విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నారు. వారిలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక సహాయకుడు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. వీడియోలలో విమానం ముక్కలు విస్తరించి పడి ఉండటం, దట్టమైన పొగ ఎగసిపడటం స్పష్టంగా కనిపించింది.
బారామతి విమానాశ్రయ మేనేజర్ శివాజీ తావరే తెలిపిన వివరాల ప్రకారం, VT-SSK రిజిస్ట్రేషన్ ఉన్న లీర్జెట్ 45 విమానం ముంబై నుంచి చార్టెడ్ ఫ్లైట్గా వచ్చింది. ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే పక్కకు వెళ్లి కూలిపోయి పేలిపోయిందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వాతావరణం, సాంకేతిక లోపాలు, ల్యాండింగ్ సమయంలో జరిగిన పరిస్థితులు అన్నింటినీ పరిశీలిస్తున్నారు.
Plane Crash: వరుస పేలుళ్లు, భారీ మంటలు.. అజిత్ పవార్ ప్రమాదంపై ప్రత్యక్షుల సంచలనం!
బారామతిలో అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం రన్వేకు సుమారు 100 అడుగుల దూరంలో ల్యాండ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. కూలిన వెంటనే భారీ మంటలు చెలరేగి 4-5 సార్లు పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
Plane Crash
Plane Crash: మహారాష్ట్ర బారామతిలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్(Ajit Pawar)తో పాటు మొత్తం ఐదుగురు మృతి చెందడం రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ ప్రమాదం రన్వేకు చాలా దగ్గరగా జరిగిందని, కళ్లారా చూసిన వారు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షుల మాటల ప్రకారం, విమానం ల్యాండ్ అవుతున్న సమయంలోనే నియంత్రణ కోల్పోయినట్టు కనిపించింది. రన్వేకు సుమారు 100 అడుగుల దూరంలో విమానం ఒక్కసారిగా నేలను ఢీకొని పేలిపోయిందని వారు చెప్పారు. విమానం కూలిన వెంటనే భారీ శబ్దంతో పేలుడు జరిగి, చుట్టూ మంటలు చెలరేగాయని తెలిపారు.
ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, “విమానం దిగుతున్నప్పుడే ఏదో తప్పు జరుగుతోందని అనిపించింది. క్షణాల్లోనే అది కూలిపోయి పెద్ద పేలుడు జరిగింది. ఆ తర్వాత మరో నాలుగు నుంచి ఐదు సార్లు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి” అని చెప్పారు.
ప్రమాదాన్ని చూసిన వెంటనే స్థానిక ప్రజలు సంఘటన స్థలానికి పరుగులు తీశారు. విమానంలో ఉన్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నించామని, కానీ మంటలు చాలా ఎక్కువగా ఉండటంతో ఎవరినీ రక్షించలేకపోయామని మరో ప్రత్యక్ష సాక్షి వాపోయాడు. “మంటలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దగ్గరకు వెళ్లడం కూడా కష్టమైంది” అని తెలిపారు.
ఒక స్థానిక మహిళ మాట్లాడుతూ, పేలుడు సమయంలో విమానం ముక్కలు గాల్లోకి ఎగిరి తన ఇంటి దగ్గర పడినట్లు చెప్పారు. “విమానం రన్వే వైపు వస్తుండగా కొంచెం ఒరిగినట్టు కనిపించింది. వెంటనే నేలను బలంగా ఢీకొట్టి పేలిపోయింది. ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంది” అని ఆమె వివరించారు.
ఈ విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నారు. వారిలో అజిత్ పవార్తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి, ఒక సహాయకుడు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే విమానం పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. వీడియోలలో విమానం ముక్కలు విస్తరించి పడి ఉండటం, దట్టమైన పొగ ఎగసిపడటం స్పష్టంగా కనిపించింది.
బారామతి విమానాశ్రయ మేనేజర్ శివాజీ తావరే తెలిపిన వివరాల ప్రకారం, VT-SSK రిజిస్ట్రేషన్ ఉన్న లీర్జెట్ 45 విమానం ముంబై నుంచి చార్టెడ్ ఫ్లైట్గా వచ్చింది. ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వే పక్కకు వెళ్లి కూలిపోయి పేలిపోయిందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వాతావరణం, సాంకేతిక లోపాలు, ల్యాండింగ్ సమయంలో జరిగిన పరిస్థితులు అన్నింటినీ పరిశీలిస్తున్నారు.