/rtv/media/media_files/2025/03/08/yQQ4iYYo4by8ewU4NWHy.jpg)
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా జీవితాలకు ఆదర్శంగా నిలిచే కొంతమంది మహిళల విజయ గాధాలను తెలుసునే ప్రయత్నం చేద్దాం.
యాల్సిన పనులకు శారీరక బలం మాత్రమే కాదు, మానసిక బలం కూడా అవసరం. కానీ ఓ 29 ఏళ్ల యువతి అక్కడే పనిచేస్తోంది. కుటుంబాన్ని పోషించడానికి పెళ్లి చేసుకోకుండా ఆ ఉద్యోగం మీదే ఆధారపడి జీవితంలో ముందుకు వెళ్తుంది. పశ్చిమ బెంగాల్లోని బారుపూర్లోని పురందర్పూర్ శ్మశానవాటికలో మృతదేహాలను దహనం చేసే బాధ్యతను తుంపా దాస్ అనే ఓ మహిళపై చేస్తోంది. తన తండ్రి ఆకస్మిక మరణం తరువాత తుంపా దాస్ తన కుటుంబాన్ని అండగా నిలిచేందుకు శ్మశాన వాటికలో పనిచేయడం ప్రారంభించింది.
తుంపా వయసు ప్రస్తుతం 29 సంవత్సరాలు...2014 లో ఆమె ఈ వృత్తిలోకి ప్రవేశించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని.. ఆమె 10వ తరగతి తర్వాత చదువును వదిలివేసి నర్సింగ్లో శిక్షణ తీసుకుంది. ఆ తరువాత అక్కడ వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించడం కష్టమైంది. దీంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి కుటుంబ అవసరాల కోసం తన తండ్రి చేసిన పనిలో చేరాలని నిర్ణయించుకుంది. అప్పుడు కుటుంబం, సమాజం నుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. పశ్చిమ బెంగాల్కు మొదటి మహిళా డోమ్ ఈమె కావడం విశేషం.
పెళ్లి చేసుకోకుండా రూ. 5 వేల జీతంతో
తన పని కేవలం మృతదేహాలను తగలబెట్టడం మాత్రమే కాదని.. చనిపోయిన వారి పత్రాలను సిద్ధం చేసి ఇవ్వడం.. అంత్యక్రియల ప్రక్రియ పూర్తి చేశాక.. ఆ బూడిదను కుటుంబానికి అప్పగించడం అని తెలిపింది. సమాజంలో చూస్తున్న కొన్ని ఘటనలు పరిశీలిస్తే.. తనకు చనిపోయిన డెడ్ బాడీలకంటే.. బతుకున్న మనుషులంటేనే భయంగా ఉందని వెల్లడించింది. శ్మశానవాటికలో పనిచేసినందుకు తనకు నెలకు రూ. 5000 జీతం ఇస్తున్నారని తెలిపింది. ఇంత తక్కువ జీతంతో కుటుంబ ఖర్చులు గడవడం కష్టమే అయినప్పటికీ.. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు కొన్నిసార్లు తనకు కొంత డబ్బు ఇస్తుందని చెప్పుకొచ్చింది. తుంపా దాస్ వయసు ప్రస్తుతం 29 సంవత్సరాలు కాగా ఆమె చేసే వృత్తి దృష్ట్యా ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోడానికి ముందుకు రాలేదు. పెళ్లి కారణంగా తాను ఉద్యోగం పోగొట్టుకుంటే తన కుటుబం రోడ్డున పడుతుందని తన వల్ల తన కుటుంబానికి అలాంటి దుస్థితి రావడం తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. తాను ఎప్పుడూ పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది.
Also read : మహిళలకు గుడ్న్యూస్.. నెలకు రూ.2500 స్కీమ్ ప్రారంభం