/rtv/media/media_files/2025/03/03/vBqcclJGeBJvIvckMkGr.jpg)
హర్యానాలోని రోహ్తక్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్త హిమాని నర్వాల్ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఈ సీసీటీవీ ఫుటేజీలో హిమానిని హత్య చేసిన నిందితుడు సచిన్ ఒక నల్లటి ట్రాలీ బ్యాగ్ను తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫుటేజ్ ఫిబ్రవరి 28న రాత్రి 10 గంటలకు హిమాని ఇంటి సమీపంలో రికార్డ్ చేయబడింది. మార్చి 1న ఉదయం 11 గంటలకు సమల్ఖా బస్ స్టాండ్ సమీపంలో ఈ సూట్కేస్లో బాధితురాలి మృతదేహం పోలీసులకు దొరికింది.
రోహ్తక్లో అదనపు డీజీపీ కె కె రావు మాట్లాడుతూ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిందితుడు సచిన్ హర్యానాలోని ఝజ్జర్ జిల్లా నివాసి. అతను అక్కడ మొబైల్ ఫోన్ దుకాణం నడుపుతున్నాడని.. అతన్ని ఢిల్లీలో అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు. నిందితుడు సచిన్ కు హిమాని నర్వాల్ కు ఏడాదిన్నరకు పైగా పరిచయం ఉంది. సోషల్ మీడియా ద్వారా ఇద్దరికి పరిచయం ఏర్పడగా.. అతను రోహ్తక్లోని హిమాని ఇంటికి తరచుగా వెళ్లేవాడు.
అందులో భాగంగానే ఫిబ్రవరి 27న ఆమె ఇంటికి వెళ్లాడు సచిన్. అక్కడ ఇద్దరి మధ్య ఏదో విషయం గురించి గొడవ జరిగింది. దీని తరువాత సచిన్ తన మొబైల్ ఫోన్ ఛార్జర్తో హిమానీ గొంతు కోసి చంపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. హత్య తర్వాత, సచిన్ ఆమె నగలు, ల్యాప్టాప్ మరియు ఉంగరాన్ని తీసుకొని ఝజ్జర్కు వెళ్లాడు. అదే రోజు రాత్రి ఆమె మృతదేహాన్ని ఒక నల్ల సూట్కేస్లో పెట్టి ఓ ఆటోను బుక్ చేసుకుని సమల్ఖా బస్ స్టాండ్ దగ్గర ఆ సూట్కేస్ను విసిరివేసి పారిపోయాడు. హిమానీ, సచిన్ మధ్య గొడవకు కారణం ఇంకా తెలియరాలేదు. పోలీసు రిమాండ్ సమయంలో అతన్ని విచారిస్తారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్ సహా ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసులో సచిన్ అనేక షాకింగ్ విషయాలను వెల్లడించాడు. తనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని అతనే పోలీసులకు చెప్పాడు. సచిన్ మొబైల్ రిపేరింగ్ షాపు నడుపుతున్నాడు. అయితే సచిన్, హిమాని మధ్య ఉన్న రిలేషన్ ఏంటీ అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఇద్దరి మధ్య లవ్ ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాధితురాలి తల్లి సంచలన ఆరోపణలు
కాగా బాధితురాలి తల్లి సవిత కొన్ని షాకింగ్ ఆరోపణలు చేసింది. రాజకీయాల్లో తన కూతురు ఎదుగుదలను తట్టుకోలేక పార్టీలోని కొందరు వ్యక్తులే తన కూతురిని హతమార్చి ఉండొచ్చంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. హిమానీ కాంగ్రెస్ కోసం పదేళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. పార్టీలోని గొడవలు, వాగ్వాదాలపై కూతురు తనతో చెప్పేదని, తప్పొప్పుల విషయంలో ఆమె కాంప్రమైజ్ అయ్యేది కాదన్నారు సవిత. తన కూతురికి న్యాయం జరిగే వరకు తన కూతురికి అంత్యక్రియలు చేయనని అన్నారు.
Also read : 40 ఏళ్లుగా పరారీలో..పోలీసులకే చుక్కలు చూపించాడు.. చివరకు.. !