AP: వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు..!

ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు టీడీపీలో చేరారు. వీరితో పాటు పలువురు వైసీపీ నేతలకు మంత్రి లోకేష్ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

New Update
AP: వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన కీలక నేతలు..!

Nara Lokesh: ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ కీలక నేతలు ఆ పార్టీకి షాక్ ఇస్తూ టీడీపీలో చేరారు. ఈ క్రమంలోనే తాజాగా, ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు.

Also Read: తాడిపత్రిలో సొంత పార్టీ నేతలకు జేసీ వార్నింగ్..!

వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరిందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజాప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు