Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు పేరుతో నెట్టింట్లో ఓ లెటర్ వైరల్ అవుతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో చెబుతూ చంద్రబాబు పేరుతో లెటర్ రాసి ఉంది. అయితే, ఈ లెటర్ పై టీడీపీ సీరియస్ గా స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ కి ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ ఫేక్ లెటర్ చెబుతోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. కుల అహంకారంతో విర్రవీగే జగన్ రెడ్డి.. రాజకీయ ప్రయోజనాల కోసం అదే కులాలను రెచ్చగొడుతున్నాడని దుయ్యబట్టారు. ఈ ఫేక్ గాళ్ళ మాటలను, చేతలను నమ్మకండి అంటూ వైసీపీ శ్రేణలపై ధ్వజమెత్తుతున్నారు. తాజాగా, ఈ లెటర్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు.
Also read: చంద్రబాబుకు మళ్లీ షాక్
కుల,మత, ప్రాంత విద్వేషాలు రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చంద్రబాబు నాయుడు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఫైర్ అయ్యారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also read: మరికాసేపట్లో టీడీపీ-జనసేన జేఏసీ రెండో సమావేశం