Thandel : 'తండేల్' బడ్జెట్ అన్ని కోట్లా?.. చైతూతో వర్కౌట్ అవుతుందా..?

నాగ చైతన్య హీరోగా 'తండేల్' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం, తెలిసిందే. తాజాగా ఈ మూవీ బడ్జెట్ ఎంతో నిర్మాత బన్నీ వాస్ రివీల్ చేశారు. ఆయన కొత్త సినిమా 'ఆయ్' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో 'తండేల్' సినిమాను రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలిపారు.

New Update
Thandel : 'తండేల్' బడ్జెట్ అన్ని కోట్లా?.. చైతూతో వర్కౌట్ అవుతుందా..?

Naga Chaitanya's Thandel Movie Budget : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు చందు మొండేటితో కలిసి ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా తెరకెక్కుతున్న‘తండేల్’ మూవీ శరవేగంగా సాగుతోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. చైతూ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నట్లు నిర్మాతలు ఇప్పటికే చెప్పారు. అయితే తాజాగా ఈ మూవీ బడ్జెట్ ఎంతో నిర్మాత బన్నీ వాస్ రివీల్ చేశారు. ఆయన కొత్త సినిమా 'ఆయ్' సాంగ్ లాంచ్ ఈవెంట్ లో తండేల్ మూవీ గురించి మాట్లాడారు. ఈ సినిమాను రూ.75 కోట్ల భారీ బడ్జెట్‌తో తాండల్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

Also Read : ఓటీటీలో అదరగొడుతున్న సుధీర్ బాబు యాక్షన్ మూవీ.. ఏకంగా టాప్-1 ట్రెండింగ్ లో..!

ఈ విషయం తెలిసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకే మేకర్స్ ఈ రేంజ్ బడ్జెట్ కేటాయిస్తుంటారు. మీడియం రేంజ్ హీరో అయినా అతనికి సక్సెస్ రేట్ ఎక్కువుండి, మార్కెట్ భారీగా ఉంటేనే నిర్మాతలు ఈ రిస్క్ తీసుకుంటారు. కానీ నాగ చైతన్య విషయానికొస్తే.. ఈ మధ్య సరైన సక్సెస్ లేదు, మార్కెట్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.

అలాంటిది 'తండేల్' కోసం రూ.75 కోట్ల బడ్జెట్ అంటే వర్కౌట్ అవుతుందా? అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ మేకర్స్ మాత్రం కథపై నమ్మకంతో అంత బడ్జెట్ పెట్టేందుకు ఆసక్తి చూపినట్లు చెబుతున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర 'తండేల్' ఆ రేంజ్ సక్సెస్ అందుకుంటేందేమో చూడాలి. కాగా ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలని మొదట అనుకున్నా.. ఆ సమయంలో పలు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతుండటంతో మేకర్స్ వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

Advertisment
తాజా కథనాలు