Mythri Movie Makers : వరద బాధితులకు 'పుష్ప' నిర్మాతల విరాళం..

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Mythri Movie Makers : వరద బాధితులకు 'పుష్ప' నిర్మాతల విరాళం..
New Update

Mythri Movie Makers : తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ అంతా కదిలొస్తోంది. అగ్ర హీరోలతో పాటూ పలువురు నిర్మాతలు సైతం తమ వంతు సాయం అందించారు. ఇప్పటికే వైజయంతీ మూవీస్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.45 లక్షల విరాళం ఇచ్చారు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షలు డొనేట్ చేశారు.



Also Read : తమ్ముడు మోక్షజ్ఞకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..! ట్వీట్ వైరల్

" గడిచిన వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ ఆపద సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలకు మా వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షలు విరాళంగా ఇస్తున్నాం. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలి. బాధిత కుటుంబాలు సాధారణ స్థితికి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం" అంటూ నిర్మాణ సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది.

#mythri-movie-makers
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe