YS Sharmila: ముంబై నటి కేసులో జగన్ హస్తం? షర్మిల సంచలన ఆరోపణలు!

ముంబై నటి కాదంబరి జెత్వానీ ఇష్యూలో మాజీ సీఎం జగన్ ప్రమేయం ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. జెత్వానీ నోరు మూయించడానికి సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారని ఆరోపించారు. ఇద్దరు కూతుళ్లున్న జగన్ ఆమె విషయం ఎందుకు ఆలోచించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

YS Sharmila: ముంబై నటి కేసులో జగన్ హస్తం? షర్మిల సంచలన ఆరోపణలు!
New Update

Actress Jatwani Case: ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో మాజీ సీఎం జగన్ హస్తం ఉందంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. జెత్వానీ నోరు మూయించడానికి సజ్జన్ జిందాల్, జగన్ ప్లాన్ చేశారని ఆమె ఆరోపించారు. కడపలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో వైఎస్‌ షర్మిల పలు అంశాలపై మాట్లాడారు. ఇంత నీచానికి ఒడిగట్టడం దుర్మార్గమని, జగన్ కు తెలియకుండానే ఐఎఎస్, ఐపిఎస్ లు సజ్జన్ జిందాల్ కు కనెక్ట్ అయ్యారా అంటూ జగన్ ను ప్రశ్నించారు.

'ఒక మహిళను అడ్డుకోవడానికి ఎన్నో ప్లాన్లు వేశారు. కాదంబరి జెత్వానీ ఒక మహిళా డాక్టర్. ఆమెను మానసికంగా వేదనకు గురిచేశారు. యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారు. కేసు పెడితే తొక్కి పడేసారు. కాదంబారి జైత్వాల్ సామాన్యురాలు అయితే వంద కోట్లు ఇచ్చి నొక్కి పెట్టేసేవారు. కాదంబారి జైత్వాల్ కి అండగా పోరాటం చేయడానికి సిద్ధం. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చెయ్యడం దుర్మార్గం. జగన్ కు తెలియకుండానే ఐఎఎస్, ఐపిఎస్ లు కాదంబరి జైత్వాల్ ను అరెస్ట్ చేశారా? కాదంబరి వ్యవహారంపై జగన్ సమాధానం చెప్పాలి. ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్ కాదంబరికి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల.

#actress-jatwani #ys-sharmila #ys-jagan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe