MP Ranjith Reddy: ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు.. ఎంపీ రంజిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు

New Update
MP Ranjith Reddy: ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు.. ఎంపీ రంజిత్ కుమార్ కీలక వ్యాఖ్యలు

MP Ranjith Reddy: చేవెళ్ళ పార్లమెంట్​ పరిధిలో ఆరు గ్యారంటీలకు అప్లయ్​ చేసిన ప్రతి అర్హుడికి కాంగ్రెస్​ ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ డాక్టర్​ జి. రంజిత్​ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం తుక్కుగూడ కాంగ్రెస్​ జనజాతర భారీ బహిరంగ సభలో ఎంపీ రంజిత్​ రెడ్డి ప్రసంగించారు.

ఈ సందర్భంగా రంజిత్​ రెడ్డి మాట్లాడుతూ… బ్రిటిషోడు ఈ దేశాన్ని మొత్తం ఊడ్సుకపొయిన తర్వాత... పేదోల్లకు పట్టెడన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని… గాంధీ, నెహ్రూ కుటుంబమే అని చెప్పారు. సంక్షోభం నుంచి సంక్షేమం కాంగ్రెస్​తోనే దేశానికి దశా‌‌-దిశ దొరికిందని అన్నారు. తమ చేవెళ్ళ వైవిధ్యభరితమైందని చెప్పారు. ఎందుకంటే, తమ పార్లమెంట్​ ప్రాంతం... హైదరాబాద్​ నగరానికి కూరగాయలు, పూవ్వుల నుంచి సాఫ్ట్ వేర్​ దాకా ఎగుమతి చేస్తందని చెప్పారు.

హైదరాబాద్ మహానగర వంటింట్ల కూరగాయలు, కూరలు మనయేనని… దేవునింట్ల పూవ్వులు మనవేనని... కంప్యూటర్లలో సాఫ్ట్​వేర్​ కూడా మనవేనని నొక్కి చెప్పారు. తాను ఎంత అదృష్టవంతున్ని అయితే ఈ ఇంత గొప్ప నియోజకవర్గానికి ఎంపీని అవుతానని గుర్తు చేశారు. అయితే, ఈ అదృష్టం చేవెళ్ళ ప్రజలు ఇచ్చిన అవకాశమని… అదే అదృష్టం ప్రతి చేవెళ్ళ బిడ్డ కళ్ళల్ల చూసేదాకా తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని వివరించారు.

ఒక టీచర్​ 60 ఏండ్లకు రిటైర్​ అయితడని… ఒక మిలిట్రీ సిపాయి 40 ఏండ్లకు రిటైర్​ అయితడని... కానీ తనకు మాత్రం రిటైర్మెంట్​​ తన చేవెళ్ళలో ప్రతి ఒక్కరి కల్లలో ఆనందం చూసేవరకు అంటూ భావోద్వేగానికి గురవుతూ రంజిత్​ రెడ్డి మాట్లాడారు. ఇక చేవెళ్ళ ప్రజలకు అందుబాటులో లేని నాయకుడితో తనకు ఏమాత్రం పోటీ కాదని రంజిత్​ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థికి చురకులు అంటించారు. బీజేపీ హయాంలో కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే లబ్ధి పొందినట్టు తెలిపారు.

కేంద్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను అభివృద్ధి, అందుబాటు వంటి నినాదాలతో బరిలో నిలిచానని… ఈ సారి పంచసూత్రాలతో ప్రజల ముందుకు వస్తున్నట్టు వివరించారు. అవి… అభివృద్ధి, అందుబాటు, విద్యా, వైద్యం, సంక్షేమం అని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచడమే తన జెండా… ఎజెండా అని స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు