MP Raghunandan Rao: కేసీఆర్‌పై ఈడీ కేసు.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

TG: మాజీ సీఎం కేసీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. గొర్రెల స్కాం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు.

New Update
BJP MP Raghunandan Rao: అధికారం కోసమే మోసపూరిత హామీలు ఇచ్చారు: ఎంపీ రఘునందన్‌రావు

MP Raghunandan Rao: ఈ రోజు ఎంపీగా గెలిచిన సందర్భంగా రఘునందన్ రావుకు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన గెలుపు బూత్ కమిటీ అధ్యక్షుల గెలుపు అని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రూ.1000 కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచామన్నారు. దుబ్బాక లో దెబ్బ కొట్టిన అని ఆరడుగుల హరిశ్ ఎగిరిండన్నారు. తనను గెలిపించిన మెదక్ ప్రజలకు జీవిత కాలం రుణపడి ఉంటానన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పై (KCR) మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్ పై ఈడీ (ED) కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. గొర్రెల స్కాం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకటరామిరెడ్డికి ముందుంది ముసళ్ళ పండుగ అని హెచ్చరించారు. 

Advertisment
తాజా కథనాలు