TDP MP: టీడీపీ పార్లమెంటరీ నేతగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు AP: టీడీపీ పార్లమెంటరీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపిక చేశారు చంద్రబాబు. ఈరోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో లోక్సభలో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. By V.J Reddy 22 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Lavu Krishna Devarayalu: టీడీపీ పార్లమెంటరీ నేతగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపిక చేశారు చంద్రబాబు. ఈరోజు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన టీడీపీ (TDP) పార్లమెంటరీ నేతల సమావేశం జరిగింది. ఇప్పటికే కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని ఉన్నారు. అయితే, పార్లమెంటరీ నేత ఎవరనేదానిపై స్పష్టత ఇచ్చారు చంద్రబాబు. లోక్సభలో టీడీపీకి 16 ఎంపీల బలం ఉంది. ఈనెల 24 నుంచి లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. లోక్సభలో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలతో చంద్రబాబు చర్చించారు. వైసీపీ నుండి మొదలు.. ప్రముఖ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడైన లావు శ్రీకృష్ణదేవరాయులు 2019లో వైసీపీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే.. 2024లో నరసరావుపేట టికెట్ ను మాజీ మంత్రి అనిల్ కు వైసీపీకి కేటాయించింది. శ్రీకృష్ణదేవరాయులును గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పడంతో ఆయన మనస్థాపానికి గురై వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి నరసరావుపేట నుంచి బరిలోకి దిగి రెండోసారి విజయం సాధించారు. #lavu-sri-krishna-devarayalu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి