TS Politics: ఎంపీ బండి సంజయ్ వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్..కొనసాగుతున్న మాటల యుద్ధం.!

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ కూలగొడుతుందని బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఇంటర్ ఫెయిల్ అయిన సంజయ్ జ్యోతిష్యం ఎప్పుడు నేర్చుకున్నారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరు టచ్ చేయలేరని పొన్నం కామెంట్స్ చేశారు.

New Update
TS Politics: ఎంపీ బండి సంజయ్ వర్సెస్ మంత్రి పొన్నం ప్రభాకర్..కొనసాగుతున్న మాటల యుద్ధం.!

TS Politics: కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని.. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టులు అని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ కుమార్. దీనిపైన జాగ్రత్త అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.

Also Read: బుద్ధిలేని హీనులే ఇలా చేస్తారు.. జగన్ కు మోహన్ బాబు కౌంటర్

సంజయ్ కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క దీవెనలతో ఏర్పడిందని ఇంటర్ ఫెయిల్ అయిన సంజయ్ జ్యోతిష్యం ఎప్పుడు నేర్చుకున్నారని ఆయన ఎద్దేవ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరు టచ్ చేయలేరని పొన్నం అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒకవేళ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే టిఆర్ఎస్ పార్టీని తెలంగాణలో రెండుగా చీల్చేది బీజేపీ పార్టీ మాత్రమేనని పొన్నం కామెంట్స్ చేశారు.

Also Read: రాజీనామా చేసి మర్యాద నిలబెట్టుకోండి.. వైసీపీ ఎంపీపీపై తిరుగుబాటు..!

పొన్నం కౌంటర్ ఇచ్చిన కాసేపటికి కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న బండి సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ నేతలను విమర్శిస్తే పొన్నంకు ఉల్లికెందుకని బండి చురకలంటించారు. మొత్తం మీద ఇలా బండి వర్సెస్ పొన్నం కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు