BIG BREAKING: 100 మందికి పైగా మృతి!

తూర్పు గాజాలోని దారాజ్ జిల్లాలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఈ రోజు తెల్లవారుజామున జరిపిన దాడుల్లో 100 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా .

BIG BREAKING: 100 మందికి పైగా మృతి!
New Update

Israeli strike: ఇజ్రాయెల్ దాడుల్లో గాజా పాఠశాలలో 100 మందికి పైగా మరణించారని అక్కడి స్థానికి మీడియా సంస్థ పేర్కొంది. తూర్పు గాజాలోని దారాజ్ జిల్లాలో నిరాశ్రయులైన ప్రజలకు ఆశ్రయం కల్పిస్తున్న పాఠశాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ దాడుల్లో 100 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ WAFA తెలిపింది. శనివారం తెల్లవారుజామున గాజా నగరంలోని పాఠశాలపై ఇజ్రాయెల్ దాడి జరిగిందని, 40 మంది మరణించారని, ఇజ్రాయెల్ సైన్యం హమాస్ కమాండ్ సెంటర్‌పై దాడి చేసిందని గతంలో పేర్కొంది.

ఏజెన్సీ ప్రతినిధి మహమూద్ బసల్ ఈ సంఘటనను టెలిగ్రామ్‌లోని పోస్ట్‌లో "ఒక భయంకరమైన ఊచకోత"గా అభివర్ణించారు, కొన్ని మృతదేహాలు మంటలు అంటుకున్నాయని అన్నారు. "అమరవీరుల మృతదేహాలను వెలికితీసేందుకు.. క్షతగాత్రులను రక్షించడానికి సిబ్బంది మంటలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నారు," అని ఆయన చెప్పారు.

#israeli-strike
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe