2023 వన్డే ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్థాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టడంపై ఆ దేశ మాజీలతోపాటు పలువురు అసంహనం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ బాబర్ అజామ్తోపాటు పాక్ క్రికెట్ వ్యవస్థను టార్గెట్ చేస్తూ పలు అంశాలను లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా.. బాబర్ ఆజం ఒత్తిడిని సమర్థి్స్తూనే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) దేశంలో క్రికెట్ను నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలో స్పందించిన పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్.. ఆటగాళ్లు విఫలమైతే పాక్ క్రికెట్ బోర్డ్ పై విమర్శలు చేయడం సరికాదని, ఒకదాంట్లో ఫెయిల్ అయినంత మాత్రానా వ్యవస్థలను తప్పుబట్టడం సరైనది కాదన్నారు. అలాగే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ను ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
పూర్తిగా చదవండి..‘ధోనీని చూసి నేర్చుకోండి’.. రమీజ్ రాజాకు గడ్డిపెట్టిన పాక్ మాజీ పేసర్
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) దేశంలో క్రికెట్ను నాశనం చేస్తోందని మాజీ కెప్టెన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలను మహమ్మద్ అమీర్ తప్పుబట్టారు. కెప్టెన్ బాబర్ విఫలమైతే బోర్ట్ ఫెయిల్ అయినట్లు కాదన్నారు. నాణ్యమైన క్రికెటర్లను తయారు చేయడంలో ధోనిని చూసి నేర్చుకోవాలన్నారు.
Translate this News: