Manipur Cm: మణిపూర్‌ ముఖ్యమంత్రి ఇంటి పై దాడి!

మెయితీ విద్యార్థుల హత్యతో రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. విద్యార్థులను చంపిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి ఇంటి పై దాడి జరిగింది. ఇంఫాల్ శివార్లలో సీఎం బీరెన్‌ సింగ్ పూర్వీకులకు సంబంధించిన ఇల్లు ఒకటి ఉంది.

New Update
Manipur Cm: మణిపూర్‌ ముఖ్యమంత్రి ఇంటి పై దాడి!

మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్ కి సంబంధించిన ఓ ఇంటి పై అల్లరి మూకలు దాడి చేశాయి. ఇంఫాల్ లో ఈ ఘటన జరిగింది. గత కొన్ని నెలల నుంచి మణిపూర్‌ లో హింస బాగా పెరిగిపోయింది. దీంతో మణిపూర్ అగ్నిగుండంగా మారింది. మెయితీ, కుకీల తెగల మధ్య చెలరేగిన జాతి విభేదాలతో మణిపూర్‌ అట్టుడుకుతుంది.

ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 200 మంది వరకు మరణించారు. రెండు రోజుల క్రితం కూడా మెయితీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులను దుండగులు చంపిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో మరోసారి రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు నెలల క్రితం మిస్సైన విద్యార్థులుగా వారిని గుర్తించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మెయితీ విద్యార్థుల హత్యతో రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. విద్యార్థులను చంపిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి ఇంటి పై దాడి జరిగింది. ఇంఫాల్ శివార్లలో సీఎం బీరెన్‌ సింగ్ పూర్వీకులకు సంబంధించిన ఇల్లు ఒకటి ఉంది.

దీని పై శుక్రవారం తెల్లవారు జామున కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి దాడికి ప్రయత్నించారు. దుండుగులు దాడి చేస్తున్న సమయంలో భద్రతా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపి గుంపును అడ్డుకున్నారు. ప్రస్తుతం సీఎం వేరే అధికారిక నివాసంలో ఉంటున్నారు. దాడి జరిగిన ఇంటిలో ప్రస్తుతం ఎవరూ లేకపోయినప్పటికీ..దానికి భద్రత మాత్రం ఉంది.

రెండు గుంపులుగా వచ్చిన అల్లరి మూకలు దాడికి యత్నించాయి. పరిస్థితి తీవ్ర రూపం దాల్చడంతో ముఖ్యమంత్రి ఇంటి వద్ద ప్రస్తుతం విద్యుత్ కనెక్షన్‌ తీసేసి, భద్రతను మరింత పెంచి కాపలా కాస్తున్నారు. అంతకుముందు బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు.

నాలుగు నెలలుగా మణిపూర్ రాష్ట్రం అట్టుకుడుతోంది. కుకీ, మైతీ కమ్యునిటీల మధ్య మొదలైన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. వందల ప్రాణానలు పొట్టనపెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన మొత్తం దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఆ రాష్ట్రం నెమ్మదిగా కోలుకుంటోంది. ఇలాంటి టైమ్ లో మరో దారుణం వెలగులోకి వచ్చింది. మైతీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్ధులు అదృశ్యమయ్యారు.

ఇప్పుడు వారి హత్య ఘటన బయటకు వచ్చింది. జూలైలో కనిపించకుండా పోయిన విద్యార్ధులు అల్లరిమూకల స్వాధీనంలో ఉన్న ఫోటోలు హఠాత్తుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా విద్యార్ధులు ఇద్దరూ దారుణంగా హత్యకు గురైన ఫోటో కూడా నెట్ లో కనిపించింది. దీంతో మళ్ళీ ఈ మొత్తం వ్యవహారం దేశంలో దుమారం రేపుతోంది.

హిజామ్ కు 17 ఏళ్ళు, ఫిజామ్ హేమ్ జిత్ కు 20 ఏళ్ళు. వీళ్ళిద్దరూ మైతీ వర్గానికి చెందినవారు. జూలై 6వ తేదీన రాష్ట్రంలో ఆంక్షలు సడలించడంతో ఫిజామ్ నీట్ కోచింగ్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. దాని తర్వాత తన స్నేహితుడితో బైక్ మీద లాంగ్ డ్రైవ్ కు వెళ్ళింది. అప్పటి నుంచి వారిద్దరి జాడా లేదు. ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఇంఫాల్ సమీపంలోని నంబోల్ వైపు వెళ్ళినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిందని అప్పట్లో పోలీసులు తెలిపారు. ఆ సమయంలోనే సాయుధులు వారిని కిడ్నాప్ చేసి హత్య చేసుండొచ్చని తెలుస్తోంది.

మైతీ వర్గానికి చెందిన హిజామ్ లిన్ తో ఇంగంబి, ఫిజామ్ హేమ్ జిత్ లు అడవిలో గడ్డిలో కూర్చుని ఉన్నారు. వారి వెనుక అల్లరి మూకకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో నిలబడి ఉన్నారు. ఈ ఫోటోతో పాటూ మరో ఫోటో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో రెండు మృతదేహాలు నేల మీద పడేసినట్లు కనిపిస్తున్నాయి. దీన్నిబట్టి వారిద్దరినీ అల్లరి మూకలు హత్య చేశారని తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మణిపూర్ ప్రభుత్వం స్పందించింది. విద్యార్ధుల ఫోటోలు తమ దృష్టికి వచ్చాయని ప్రకటించింది.

ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లు తెలిపింది. విద్యార్ధులు ఎలా అదృశ్యమయ్యారు? ఎవరు కిడ్నాప్ చేశారు? హత్య చేసిన వారిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని మణిపూర్ ప్రభుత్వం చెబుతోంది. విద్యార్ధుల హత్యకు కారనమైన వారి మీద వేంగా చర్యలు తీసుకుంటామని….ప్రజలు శాంతంగా ఉండాలని కోరుతోంది. అయితే విద్యార్ధులు అదృశ్యమయి ఇప్పటికి నాలుగు నెలలు గడుస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును ఛేదించడానికి ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారని మండిపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు