MLC Kavitha: 5 నెలల తర్వాత నేడు హైదరాబాద్‌కు కవిత.. స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు!

TG: ఎమ్మెల్సీ కవిత ఈరోజు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో దాదాపు 5నెలలు తీహార్ జైలులో ఉన్న కవిత బెయిల్‌తో నిన్న విడుదలయ్యారు.

MLC Kavitha: 5 నెలల తర్వాత నేడు హైదరాబాద్‌కు కవిత.. స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు!
New Update

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత నిన్న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు ఆమె హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45 గం.కు ఢిల్లీ నుంచి కవిత బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గం.కు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ప్రస్తుతం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆమె ఉన్నారు. కవితతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు.

రాత్రి ఎమ్మెల్యేలందరితో కవిత సమావేశం అయ్యారు. కష్టకాలంలో నిలిచినందుకు వారికి థ్యాంక్స్ చెప్పారు. ఎమ్మెల్యేలందరికి మిఠాయి తినిపించారు. కవిత రిలీజ్ తర్వాత జైలు బయట ఎమోషనల్ సీన్స్ చోటు చేసుకున్నాయి. బయటకు రాగానే బిగ్గరగా ఏడ్చేశారు కవిత. తన కొడుకు ఆదిత్యను పట్టుకుని కవిత భావోద్వేగానికి లోనయ్యారు. భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌ను కౌగిలించుకుని కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా మార్చి 15న లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 5 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపిన కవిత ఎట్టకేలకు నిన్న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో విడుదలయ్యారు.

#mlc-kavitha
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe