MLC Duvvada : భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

AP: భార్య వాణిపై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. రెండేళ్లుగా తాము విడిగా ఉంటున్నామని.. కేవలం తన పేరును మీద ఉన్న మైన్‌ను ఆమె పేరు మీద రాయాలని ఒత్తిడి తెచ్చిందని.. కేవలం డబ్బుల కోసమే తన భార్య ఇలా చేస్తుందని ఆరోపించారు.

New Update
MLC Duvvada : భార్యపై ఎమ్మెల్సీ దువ్వాడ కీలక వ్యాఖ్యలు

MLC Duvvada Made Allegations On His Wife : తన కుటుంబమే తనపై దాడి చేస్తోందని అన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas). కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని చెప్పారు. వాణికి రాజకీయ ఆకాంక్ష ఎక్కువ అని ఆరోపించారు. ఓ కూతురు పెళ్లి చేశానని.. మరో కూతురి పెళ్లి చేయాల్సి ఉందని అన్నారు. రెండేళ్లుగా విడిగానే ఉంటున్నట్లు తెలిపారు. ఏ జన్మలో చేసిన పాపమో ఆమెను పెళ్లి  (Marriage) చేసుకున్న.. 30 ఏళ్లు నరకం చూపించిందని అన్నారు. తన తల్లిని తన నుంచి దూరం చేసిందని మండిపడ్డారు. తన తల్లిని ఎప్పుడు కలిసేందుకు వెళ్లిన తనతో గొడవ పడేది అని.. అప్పటి నుంచి తాను తల్లికి దూరమయ్యానని చెప్పారు. ఇప్పుడే సంతోషంగా ఉంటున్నానని.. మళ్లీ రౌడీమూకలతో తనపై దాడికి వచ్చిందని అన్నారు. మైన్‌ను తన పేరు మీద మార్చాలని వాణి (Vani) ఒత్తిడి చేసేదని.. క్వారీ వద్దకు వెళ్లి డబ్బులన్నీ తనకే ఇవ్వాలంటూ రచ్చ చేసేదని ఆయన ఆరోపించారు.

Also Read : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. 7 రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ!

Advertisment
తాజా కథనాలు