AP: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే భర్త.. అధికారంలోకి వచ్చాక సీన్‌ రివర్స్‌..!

గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు భూ వివాదంలో చిక్కుకున్నారు. పొలాన్ని తన పేరుపై రాయమని వేధించారని పోలీసులకు రైతు వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే భర్త అనుచరులు తమపై దాడి చేసి తమపైనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారని రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

New Update
AP: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే భర్త.. అధికారంలోకి వచ్చాక సీన్‌ రివర్స్‌..!

Guntur: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త గల్లా రామచంద్ర రావు భూ వివాదంలో చిక్కుకున్నారు. కమ్మ వెంకటేశ్వర్లు అనే రైతు పొలాన్ని.. ఎమ్మెల్యే భర్త గల్లా రామచంద్రరావు తన పేరున రాయమని వేధిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతుకు చెందిన ఎనిమిది ఎకరాల్లో 3 ఎకరాల 90 సెంట్లను గల్లా రామచంద్రరావు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అయితే, మిగిలిన పొలాన్ని కూడా ఇవ్వమని తమను వేధిస్తున్నారని రైతు కమ్మ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే భర్త గల్లా రామచంద్ర రావు అనుచరులు తమపై దాడి చేసి తమపైనే అక్రమంగా ఎస్సీ ఎస్టీ పెట్టించారంటూ బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు గల్లా రామచంద్రరావు ద్వారా ప్రాణహాని ఉందని రైతు వాపోయాడు.

Also Read: శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్

పిడుగురాళ్లలో గతంలో ఎకరం భూమికి రూ. 48 లక్షలకు కొన్న ఎమ్మెల్యే భర్త.. 3.9 ఎకరాల కొనుగోలుకు అగ్రిమెంట్‌ చేసుకున్నాడని.. అయితే, భార్య ఎమ్మెల్యే అయ్యాక నాలుగెకరాలకు రూ. 30 లక్షలిస్తాం..ఆ పొలం అమ్మెయ్‌.. లేకుంటే బైక్‌తో ఢీకొట్టి చంపేస్తామని గల్లా రామచంద్రరావు బెదిరిస్తున్నారని బాధితుడు కమ్మ వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే, రైతు కమ్మ వెంకటేశ్వర్లు ఆరోపణలు అవాస్తవమని చల్లా రమేష్ అనే వ్యక్తి అంటున్నాడు. కంపెనీ కోసం పొలం కొనుగోలు చేశానని పొలం కొనుగోలు చేసే సమయంలో..డబ్బులు తక్కువగా ఉండటంతో ఫైనాన్స్ చేశాడని అన్నారు. అందుకు సంబంధించి ప్రతి నెలా వడ్డీ చెల్లించానన్నారు. పొలం తన పేరుపై ఉండటంతో ఇప్పుడు పది రూపాయల వడ్డీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడని..నా దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టుకు వెళ్లతానని చల్లా రమేష్ స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు