అందుకే నిన్ను నారా లోకేష్‌ కాదు..సారా లోకేష్‌ అంటారు!

సారా సొమ్ముతో చంద్రబాబు జూబ్లీహిల్స్‌ లో 300 కోట్లతో భవనం నిర్మించారని, అందుకే నారా లోకేష్‌ ను సారా లోకేష్‌ అంటారని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. యరపతినేని అనే పెద్ద మనిషి జనాభాను లూటీ చేసి..గుంటూరులో రూ.50 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు అంటూ ఆరోపించారు.

New Update
అందుకే నిన్ను నారా లోకేష్‌ కాదు..సారా లోకేష్‌ అంటారు!

సారా సొమ్ముతో చంద్రబాబు జూబ్లీహిల్స్‌ లో 300 కోట్లతో భవనం నిర్మించారని, అందుకే నారా లోకేష్‌ ను సారా లోకేష్‌ అంటారని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. యరపతినేని అనే పెద్ద మనిషి జనాభాను లూటీ చేసి..గుంటూరులో రూ.50 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు అంటూ ఆరోపించారు.

ఇలాంటి వ్యక్తులు నీతి, నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా గెలవని వ్యక్తి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా చేసేశాడు.

ఆ సమయంలో స్మశానాలు, మరుగుదొడ్లు కడుతున్నామని చెప్పి కోట్లకు కోట్లు దండుకున్నాడు అంటూ ఆరోపణలు చేశారు. బ్రహ్మానంద రెడ్డి ట్రస్ట్‌ భూమితో వారి కుటుంబం అంతా కలిసి ఏదో ఒక కాంప్లెక్స్‌ నిర్మాణం చేసుకుంటుంటే..టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా కామెంట్లు చేస్తున్నారు. వారికి తెలిసి చేస్తున్నారో..తెలియక చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు అని మండిపడ్డారు.

అసలు యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర వల్ల ఎవరికి ఉపయోగం అంటూ ఎద్దేవా చేశారు. లోకేష్‌ పిడుగురాళ్లకొచ్చి, ఏం పీకాడు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పిడుగురాళ్లకు వచ్చి గురజాలకు ఏం చేశారో వాళ్లు చెప్పలేకపోయారని అన్నారు. ఏం చేసావో చెప్పడానికి చర్చకి రమ్మంటే తుస్సుమని లోకేష్‌ పారిపోయాడని ఎద్దేవా చేశారు. మీరు మాట్లాడే ఉత్తర ప్రగల్భాలకు, మాట మీద నిలబడే జగన్‌ లాంటి వ్యక్తులకు ప్రజలు తేడా తెలుసుకున్నారని చెప్పారు.

గురజాల ప్రాంతంలో మెడికల్‌ కాలేజీ, ఇంటింటికి త్రాగునీరు బైపాస్‌ రోడ్లతో సహా అన్ని తామే పూర్తి చేశామన్నారు. ఇంకా మీరు పూర్తి చేసేదేంటో చెప్పండని నిలదీశారు.

Advertisment
తాజా కథనాలు