MLA kasu Mahesh Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటనపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయాడని టీడీపీ నేతలు పదే పదే ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. మాచర్ల నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏడెనిమిది చోట్ల ఈవీయం మిషన్లు పగలగొట్టారని చెబుతున్నారని..కానీ ఒక్క మాచర్లలో మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చింది అని ప్రశ్నించారు.
Also Read: పిన్నెల్లికి ఇలా చేయడం అలవాటే.. బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
పాలువాయి గేట్ పోలింగ్ బూత్ లో మొదట తమ కార్యకర్తలపై దాడి జరిగిందన్నారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ మొత్తం ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని కోరారు. గురజాల, మాచర్లలో పోలింగ్ సరళిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. పిన్నెల్లి దాడి ఘటన ముందు ఏమి జరిగిందో మొత్తం వీడియోని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏమి జరిగినా మాచర్లలో రామకృష్ణారెడ్డి గెలుపుని ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన బాలిక.. చివరికి దారుణం..!
మాచర్లలో అల్లర్లకు ప్రధాన కారణం టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అని ఆరోపించారు. కొత్త గణేశునిపాడులో తమ కార్యకర్తల ఇళ్లపైకి వచ్చి దాడి చేశారన్నారు. మాచర్ల, గురజాలలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియ వీడియో క్లిప్పింగ్స్ ఎందుకు బయటకు రాలేదు అని ప్రశ్నించారు. అందరిని సమానంగా చూడకపోతే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పోతుందన్నారు. పల్నాడు జిల్లాలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల సమయంలో ఏకపక్షంగా వ్యవహించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
MLA Mahesh: ఆ వీడియో క్లిప్పింగ్స్ బయటపెట్టాలి.. ఎమ్మెల్యే కాసు మహేష్ హాట్ కామెంట్స్..!
మాచర్లలో అల్లర్లకు ప్రధాన కారణం టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పిన్నెల్లి దాడి ఘటన ముందు ఏమి జరిగిందో మొత్తం వీడియోని బయటపెట్టాలన్నారు. గురజాల, మాచర్లలో పోలింగ్ సరళిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు.
MLA kasu Mahesh Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఘటనపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పారిపోయాడని టీడీపీ నేతలు పదే పదే ఊదరగొడుతున్నారని మండిపడ్డారు. మాచర్ల నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలిచారన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏడెనిమిది చోట్ల ఈవీయం మిషన్లు పగలగొట్టారని చెబుతున్నారని..కానీ ఒక్క మాచర్లలో మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చింది అని ప్రశ్నించారు.
Also Read: పిన్నెల్లికి ఇలా చేయడం అలవాటే.. బ్రహ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
పాలువాయి గేట్ పోలింగ్ బూత్ లో మొదట తమ కార్యకర్తలపై దాడి జరిగిందన్నారు. ఆ వీడియో క్లిప్పింగ్స్ మొత్తం ఎన్నికల కమిషన్ బయట పెట్టాలని కోరారు. గురజాల, మాచర్లలో పోలింగ్ సరళిపై తాము హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. పిన్నెల్లి దాడి ఘటన ముందు ఏమి జరిగిందో మొత్తం వీడియోని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏమి జరిగినా మాచర్లలో రామకృష్ణారెడ్డి గెలుపుని ఎవ్వరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన బాలిక.. చివరికి దారుణం..!
మాచర్లలో అల్లర్లకు ప్రధాన కారణం టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అని ఆరోపించారు. కొత్త గణేశునిపాడులో తమ కార్యకర్తల ఇళ్లపైకి వచ్చి దాడి చేశారన్నారు. మాచర్ల, గురజాలలో జరిగిన మొత్తం పోలింగ్ ప్రక్రియ వీడియో క్లిప్పింగ్స్ ఎందుకు బయటకు రాలేదు అని ప్రశ్నించారు. అందరిని సమానంగా చూడకపోతే ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయత పోతుందన్నారు. పల్నాడు జిల్లాలో కొందరు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. ఎన్నికల సమయంలో ఏకపక్షంగా వ్యవహించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.