Akhila Priya: ప్రజలు ఛీ కొట్టిన బుద్ధి రాలేదు.. జగన్ శవ రాజకీయాలు మానుకో: అఖిలప్రియ ఫైర్!

ఏపీ మాజీ సీఎం జగన్ ఇకనైనా శవ రాజకీయాలు మానుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియా సూచించారు. నంద్యాల ప్రజలు ఛీ కొట్టిన జగన్‌కు బుద్ధి రాలేదని, అబ్దుల్లా కలాం కుటుంబం సూసైడ్ చేసుకున్నప్పుడు జగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడని ప్రశ్నించారు.

TDP Bhuma Akhila Priya: ‘రా.. కదలిరా..’ సభకు రావొద్దు.. ఏవి సుబ్బారెడ్డికి అఖిలప్రియ కండీషన్.!
New Update

AP News: నంద్యాల ప్రజలు ఛీ కొట్టిన జగన్‌కు బుద్ధి రాలేదంటూ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన కామెంట్స్ చేశారు. ఎప్పుడు కనపడని జగన్ ఇవాళ సీతారామపురంలో కనిపించాడని, జగన్ శవ రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని సూచించారు. సీతారామపురంలో గొడవలకు శిల్పా చక్రపాణి రెడ్డి కారణమన్న అఖిల ప్రియ.. అబ్దుల్లా కలాం కుటుంబం సూసైడ్ చేసుకుంటే జగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడని ప్రశ్నించారు. రౌడీలతో, గుండాలతో మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు జగన్ రాలేదు. సీతారామపురం హత్య కేసులో చంద్రబాబును చేర్చాలని జగన్ డిమాండ్ చేస్తున్నాడు. అలా అయితే గత 5 ఐదేళ్లలో జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాలు, హత్యలను మీమ్మల్ని బాద్యులను చేయాలి. గత ఐదేళ్లలో జగన్ కు గుర్తుకు రాని మీడియాపై కొత్తగా ఇప్పుడు ప్రేమ పుట్టుకొస్తుందంటూ మండిపడ్డారు.

#nandyala #ys-jagan #mla-akilapriya
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe