అన్నం లేక చనిపోతున్న దయనీయ పరిస్థితులు.. రోడ్డుపైనే అంత్యక్రియలు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుంది. లంక ప్రజలకు చావు కష్టాలు తప్పటం లేదు. గంటగంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతుండంతో జిల్లాలో టెన్షన్‌ నెలకొంది. లంక గ్రామాల్లో చాలా మందికి తినడానికి అన్నం కూడా లేక చాలా మంది చనిపోతున్నారు. రోడ్లపైనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

New Update
అన్నం లేక చనిపోతున్న దయనీయ పరిస్థితులు.. రోడ్డుపైనే అంత్యక్రియలు

కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో కాజ్వేలు లంక గ్రామాలు నీటమునిగియాయి. ముక్తేశ్వరం ఎదురు బిడియం కాజ్వే వద్ద ఉన్న స్మశాన వాటిక వరద నీటిలో మునిగిపోవడంతో లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంక గ్రామాల్లో చనిపోయిన వ్యక్తులకు దహనకాండలు చేసేందుకు చోటు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గోదారి ఉగ్రరూపం

గోదారి ఉగ్రరూపం దాల్చింది.. లంక వాసులను హడలెత్తిస్తోంది.. ప్రధాన నదీపాయలతో పాటు లంక గ్రామాల్లోని చిన్న పాయల్లో సైతం నీరు సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. రోడ్లు.. కాజ్‌వేలను ముంచెత్తిన వరద ఇళ్ల చుట్టూ చేరింది. గోదావరి మధ్య ఉన్న లంక గ్రామాలతో పాటు ఏటిగట్లను ఆనుకుని ఉన్న లంకల్లో సైతం వరద నీరు చేరడంతో స్థానికులు రాకపోకలకు పడవలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు వరద సహాయక చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ముంపు ప్రాంత వాసులను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రైతులు ఆందోళన

కోనసీమ జిల్లాలోని లంకల్లో శనివారం (జూలై 29) రెండు అడుగుల మేర వరద ఉధృతి పెరిగింది. లంక గ్రామాల్లో ఆదివారం మరింత పెరిగింది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువన భద్రాచలం, పోలవరం, ధవళేశ్వరం వద్ద వరద పెరుగుతుండడంతో ఆ ప్రభావం జిల్లాపై పడింది. లంక గ్రామాల్లో పండే అరటి, కంద, పసుపు, కూరగాయల పొలాల్లోకి వరద నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరదతో సఖినేటిపల్లి మండలం అప్పనరామునిలంక, టేకిశెట్టిపాలెం గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. డెల్టాలో మురుగునీటి కాలువల ద్వారా ముంపు నీరు గోదావరి నదీపాయలలోకి దిగే అవకాశం లేకుండా పోయింది.
వరద ముంపు లోనే
రాజోలు దీవిలో గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇంకా వరద ముంపులోనే సఖినేటిపల్లి, మల్కిపురం, రాజోలు, మామిడికుదురు మండలాల్లో పలు గ్రామాలు ఉన్నాయి. పాశర్లపూడి-అప్పనపల్లి కాజ్వే మునిగి పోవటంతో అప్పనపల్లి, బి దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సఖినేటిపల్లి లంక-అప్పన్నరాముని లంక కాజ్వే నాలుగు గ్రామాలకు ఇంకా వరద నీటిలోనే ఉండటంతో రాకపోకలు నిలిచాయి. గత పది రోజులుగా వరద ముంపు లోనే చాకలిపాలెం - కనకాయలంక కాజ్వే కొట్టుమిట్టాడుతుంది. నాటు పడవలపైనే అవస్థలు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు ఇరు జిల్లాల ప్రజలు. అప్రమత్తమైన SDRF బృందాలు, లోకల్ పోలీస్, వరదమంపు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lokesh: మంత్రి పదవికి లోకేష్ రాజీనామా.. ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్!

విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్‌  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

New Update
lokesh

AP Minister Lokesh resign challenge to ys Jagan

Lokesh: విశాఖలో తాను భూ కబ్జా చేసినట్లు వైఎస్ జగన్ నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని నారా లోకేష్ సవాల్ చేశారు. ఒక్క రూపాయికి ఎకరం భూమి కట్టబెట్టినట్లు నిరూపించాలని, ఒకవేళ ఆ ఆరోపణలు అబద్ధమని తేలితే యువతకు జగన్‌  క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టిన లోకేష్.. ‘ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదు. ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారు అంటూ మీరు తీవ్ర ఆరోపణ చేశారు. నేను స్పష్టంగా మరోసారి చెబుతున్నా.. ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్- 3లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించాం. కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించాం. బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదు.. చేసిన ఆరోపణలు నిరూపించండి. ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి?' అని ప్రశ్నించారు. 

Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!

అలాగే 'మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది' అంటూ తీవ్ర విమర్శలు చేశారు లోకేష్‌. 

Advertisment
Advertisment