Nara Lokesh: మాజీ సీఎం జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి లోకేష్‌ సీరియస్ అయ్యారు. ప్యాలెస్‌ల పిచ్చోడా.. రాష్ట్రం నీ తాత జాగీరా అని మండిపడ్డారు. వైసీపీ ఆఫీసుల కోసం 26 జిల్లాల్లో చేసిన భూకేటాయింపులను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

New Update
Lokesh: నీ హెచ్చరికకు భయపడేది లేదు.. జగన్‌పై మంత్రి లోకేష్ ఫైర్

Minister Nara Lokesh: మాజీ సీఎం జగన్‌పై (YS Jagan) మంత్రి లోకేష్‌ సీరియస్ అయ్యారు. ప్యాలెస్‌ల పిచ్చోడా.. రాష్ట్రం నీ తాత జాగీరా అని మండిపడ్డారు. వైసీపీ ఆఫీసుల కోసం 26 జిల్లాల్లో చేసిన భూకేటాయింపులను ట్విట్టర్‌లో షేర్ చేశారు. రూ. వెయ్యి నామమాత్రపు లీజుతో 42 ఎకరాలకు పైగా కేటాయించారని అన్నారు. "నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే రూ. 500కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టివొచ్చు అని అన్నారు.

మంత్రి లోకేష్ ట్విట్టర్ (X)లో.." జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్‌లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్‌ల నిర్మాణానికి అయ్యే 500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?" అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

Also Read: మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద భారీ భద్రత!

Advertisment
తాజా కథనాలు