Kodali Nani: ఇలాంటి కూతురు ఎవరికీ ఉండదు.. పురంధేశ్వరిపై కొడాలి నాని సంచలన కామెంట్స్..

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. కన్న తండ్రికి వెన్నుపోటు పొడిచి.. ఆయన మానసిక వేదనతో చనిపోయేలా చేసిన పురంధేశ్వరి లాంటి కూతురు ఎవరికీ ఉండదన్నారు.

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు
New Update

Kodali Nani Comments on Purandeswari: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బీ టీమ్‌గా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నాడు ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తులలో పురంధేశ్వరి కూడా ఒకరని విమర్శించారు. కన్నతండ్రికి నమ్మకం ద్రోహం చేసి.. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తి పురంధేశ్వరి అని విమర్శించారు. కన్న తండ్రిని వెన్నుపోటు పోడిచి.. ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించి.. ఆయన మానసిక వేదనతో మరణించేలా చేసిన కూతురు ప్రపంచంలో ఏ తండ్రికి ఉండరని ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు కొడాలి నాని.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక దోపిడీతో పాటు అనేక దోపిడిల్లో పురంధేశ్వరీకి కూడా వాటాలు వెళ్ళేవని ఆరోపించారు కొడాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇసుక మీద రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 4,000 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇసుక మీద ఒక్కరూపాయి కూడా రాలేదని, వారంతా కలిసి అ డబ్బులు దోచుకున్నారని ఆరోపించారాయన. నాడు దోచుకుని.. ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక దోపిడి జరుగుతోందని మాట్లాడటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు పురంధేశ్వరి. ఆమె చరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తండ్రికి వెన్నుపోటి పొడిచి.. ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్‌లో చేరి లంచాలు తీసుకున్నారని పురంధేవ్వరిపై తీవ్ర ఆరోపణలు చేశారు కొడాలి నాని. అనేక పార్టీలలో మారి.. ఆ పార్టీలను భూస్థాపితం చేసిన వ్యక్తి పురంధేశ్వరి అని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరికి రాష్ట్ర ప్రజలు 2014, 2019లో బుద్ది చెప్పినా.. ఆమెలో మార్పు రాలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్‌పై ఇష్టారీతిన మాట్లాడితే ఊస్తూ ఊరుకోబోమంటూ పురంధేశ్వరికి వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని.

ఇదే సమయంలో చంద్రబాబుపైనా ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు కొడాలి నాని. చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉండటానికి గుండెకు రంద్రం పడిందంటూ నాటకాలు ఆడారని విమర్శించారు. ప్రజా ధనం దోచుకుని అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. అడ్డంగా దొరికిన దొంగ ఇప్పుడు ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికి అనేక డ్రామాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సీఎం జగన్ నాయతక్వంలో ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు పాలన అందిస్తుందన్నారని చెప్పారు.

Also Read:

అమ్మను చూసి చాలా నేర్చుకున్నాను..కూతురు పుట్టిన తరువాత జీవితమే: కేటీఆర్!

హీరో ధనుష్ కుమారుడికి షాక్ ఇచ్చిన ట్రాఫిక్ పోలీసులు.. భారీ ఫైన్

#andhra-pradesh-news #kodali-nani-comments-on-purandeswari #purandeswari #andhra-pradesh-politics #kodali-nani
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe