మెచ్చుకోలంటే మనస్సు ఉండాలి..
కోర్టు ఐఐటీ హైదరాబాద్, డైరెక్టర్ ఆర్కియాలజీ మెంబర్లు కమిటీ వేశారు. ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా పురాతనమైన భవనాన్ని కూల్చి వేయమని రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే విదంగా.. బురద జల్లే ప్రయత్నం గవర్నర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కానీ.. ఆరోపణలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. వైద్య సిబ్బంది చాలా కష్టపడుతున్నారు.. కంటి వెలుగు మీద ఒక్కసారి కూడా మెచ్చుకోలేదని గవర్నర్పై హరీష్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
వైద్య సిబ్బందిని మెచ్చుకోవడానికి గవర్నర్కు మనస్సు రాలేదు.. గవర్నర్కు మంచి కనబడదు.. చెడును మాత్రం భూతద్దం పెట్టి చూపిస్తున్నారు. చెడు చూస్తాం, చెడు చెప్తాం, చెడు వింటాం అని గవర్నర్ అంటే ఎట్లా? అని మంత్రి హరీష్రావు ప్రశ్నించారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మలేరియా నిర్దారణ కోసం 8 లక్షల ర్యాపిడ్ కిట్స్ అందుబాటులో పెడుతున్నాం.. డెంగ్యూ నిర్దారణ కోసం 1 లక్ష 23 వేల కిట్లు ఎలైజ కిట్స్ అందుబాటులోకి తీసుకోచ్చాం.. ప్లేట్ లెట్స్ ఎక్కించడం కోసం బ్లడ్ కంపోనెట్స్ మిషన్స్ ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉంచామని మంత్రి హరీష్రావు పేర్కొన్నారు.
[vuukle]