మార్గదర్శి చిట్ఫండ్పై (Margadarshi Chit fund) సీఐడీ వేసిన పిటిషన్ను ఏపీ హైకోర్టు (AP High Court) సస్పెండ్ చేసింది. చీరాల, విశాఖ, సీతంపేట బ్రాంచ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని సీఐడీ ఆయా మేనేజర్లకు పోలీసులు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ బ్రాంచ్ మేనేజర్లు హైకోర్టులో నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ సీఐడీ సైతం పిటిషన్ దాఖలు చేసింది. ఈ అంశంపై ఈ రోజు విచారణ జరిపిన హైకోర్టు సీఐడీ పిటిషన్ ను సస్పెండ్ చేసింది. అయితే.. ఈ కేసులో సీఐడీ విచారణ జరపవచ్చని కోర్టు స్పష్టం చేసింది. కానీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేయడం కుదరదని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Chandrababu Skill Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడే హైకోర్టులో విచారణ.. టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ
Margadarshi Case: మార్గదర్శికి ఊరట.. ఆ పిటిషన్ ను సస్పెండ్ చేసిన హైకోర్టు
రామోజీరావుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. చీరాల, విశాఖ, సీతంపేట బ్రాంచ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలన్న సీఐడీ పిటిషన్ ను సస్పెండ్ చేసింది.
Translate this News: