/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/yyy-jpg.webp)
Manchu Lakshmi: నటి మంచు లక్ష్మి బాలీవుడ్పై కన్నేసారు. అందుకోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘కొత్త నగరం, కొత్త శకం. ఈ జీవితం పట్ల ఆనందంగా ఉన్నా.. ఎల్లవేళలా నన్ను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు’’ అని పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఆడిషన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పోస్ట్ చేసింది. అయితే, ఆమె అభిమానులు కొందరు ఫీల్ అవుతున్నారు.. అయ్యయో..టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న మంచు అక్క బాలీవుడ్ లో ఆడిషన్స్ కు వెళ్లడం ఏంటని కాస్తా నిరాశ చెందుతున్నారు.
New City, New Era. Super grateful for this life🙏🏼❤️ Thank you to all my fans for always supporting and believing in me🥰#mumbai@mid_day @upalakbr999 https://t.co/u5iratnPzy
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) October 12, 2023
బాలీవుడ్ మూవీలు, వెబ్ సిరీస్లలో తనను తాను నిరూపించుకునేందుకు నటి మంచు లక్ష్మి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. వృత్తిపరమైన పనుల నిమిత్తమే తాను ముంబైకి మకాం మార్చినట్టు మంచు లక్ష్మి చెప్పారు. దక్షిణాదిలో తాను ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించినట్టు తెలిపారు. అక్కడ కొన్ని పరిమితులు ఉంటాయని, ఇక్కడ విస్తృతమైన అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతోనే ముంబైకి వచ్చినట్టు వెల్లడించారు. ఆడిషన్స్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలిపారు. అయితే, ఆమె అభిమానులు మాత్రం కొందరు ఫీల్ అవుతున్నారు.. అయ్యయో..టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న మంచు అక్క బాలీవుడ్ లో ఆడిషన్స్ కు వెళ్లడం ఏంటని కాస్తా నిరాశ చెందుతున్నారు.
ప్రస్తుతం ‘అగ్ని నక్షత్రం’ సినిమాలో నటిస్తున్నారు మంచు లక్ష్మి. నటి మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు కుమార్తె. కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. సోదరులు మంచు విష్ణువర్థన్ మరియు మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే.
Also Read: రూ. 100కంటే తక్కువ ధరకే సినిమా టికెట్..ఈ ఆఫర్ ఈ ఒక్కరోజే..!!