Watch Video: సింగిల్‌గా వచ్చాడు.. 25 కేజీల బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లాడు.. ఎక్కడంటే..

కోయంబత్తూరులోని ఓ నగల దుకాణంలో దొంగలు పడ్డారు. సింగిల్‌గా వచ్చి.. కస్టమర్ మాదిరిగా సెలక్టీవ్‌గా దోచుకెళ్లాడు ఓ దొంగ. ఏకంగా 25 కిలోల బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లాడు. నిందితుడి కోసం 5 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.

Watch Video: సింగిల్‌గా వచ్చాడు.. 25 కేజీల బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లాడు.. ఎక్కడంటే..
New Update

Coimbatore robbery: తమిళనాడులోని కోయంబత్తూరులో భారీ చోరీ జరిగింది. ఓ ప్రముఖ నగద దుకాణంలోంచి రూ. 25 కిలోల బంగారు, వజ్రాభరణాలను అపహరించారు. గాంధీపురంలో ఉన్న నగల దుకాణంలో ఈ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరులోని గాంధీపురంలో ఓ ప్రముఖ నగల షోరూమ్‌లో దొంగలు పడ్డారు. దొంగలు కాదు కాదు దొంగ.. డ్రిల్లింగ్ మిషిన్‌ను ఉపయోగించి షాపులోకి చొరబడ్డాడు. ముసుగు వేసుకున్న దుండగుడు చేతిలో బ్యాగ్‌తో ఏసీ డక్ట్ ద్వారా బిల్డింగ్‌లోకి ప్రవేశించాడు. ఫాల్‌ సీలింగ్ గ్యాప్ ద్వారా షోరూమ్‌లోకి ప్రవేశించాడు. షోరూమ్‌ లోపల చాలా ఆభరణాలు ఉన్నప్పటికీ.. దొంగ ఒక కస్టమర్ మాదిరిగా నగలను సెలక్ట్ చేసుకుని మరీ ఎత్తుకెళ్లాడు. షోరూమ్ రెండవ అంతస్థులో ఉన్న నగలనే టార్గెట్‌గా చోరీ చేశాడు దొంగ. మొత్తం 25 కిలోల బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..

ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!

#robbery #coimbatore-robbery
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe