Mallikarjun Kharge: కలబురగిలో ఖర్గే ఎమోషనల్.. తన అంత్యక్రియలకు రావాలంటూ!

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సొంత జిల్లా కలబురగిలో పర్యటించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్ట లేకపోయినా.. తాను ప్రజల కోసం పని చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా రావాలని కోరారు.

New Update
Mallikarjun Kharge:  కలబురగిలో ఖర్గే ఎమోషనల్.. తన అంత్యక్రియలకు రావాలంటూ!

'Come for my funeral' Says Mallikarjun Kharge: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  భావోద్వేగానికి గురయ్యారు. బుధవారం సొంత జిల్లా కలబురగిలో పర్యటించిన ఆయన.. కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్ట లేకపోయినా ప్రజల కోసం పని చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా రావాలని కోరారు. అంతేకాదు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వేయకుంటే తనకు కలబురగిలో ‘స్థానం’ లేదని భావిస్తానని ఖర్గే చెప్పారు.

ఇది కూడా చదవండి: Elon Musk: ఎలాన్‌ మస్క్‌ మరో సంచలన నిర్ణయం.. యూట్యూబ్‌ కు ధీటుగా మరో వేదిక!

మీ మనసులు గెలవలేకపోయా..
ఈ మేరకు ఖర్గే మాట్లాడుతూ.. ‘ఈసారి కాంగ్రెస్‌కు ఓటు వేయకుంటే.. మీ మనసులు గెలవలేకపోయాననుకుంటా. నాకు ఇక్కడ చోటు లేదని భావిస్తా. కాంగ్రెస్‌కు ఓటు వేసినా, వేయకపోయినా నేను ఈ ప్రాంతానికి పని చేశానని అనుకుంటే, కనీసం నా అంత్యక్రియలకైనా హాజరుకండి’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ సిద్ధాంతాలను ఓడించేందుకు పోరాడతానని చెప్పారు. వాళ్ల ముందు తలొగ్గే ప్రసక్తే లేదని, రాజకీయాల కోసమే తాను పుట్టానని, ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకున్నా.. చివరి శ్వాస వరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన స్పష్టంచేశారు.

Advertisment
తాజా కథనాలు