Malla Reddy: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు హాట్హాట్గా సాగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఢీ అంటే ఢీ అనేలా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఓవైపు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండగా.. మరోవైపు టికెట్ రాని అసంతృప్తులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాత్రం టికెట్ వచ్చినా తన కుమారుడు కోసం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించక ముందే తిరుమలలో మంత్రి హరీష్రావు టార్గెట్గా తీవ్ర విమర్శలు చేసి సంచలనం రేపారు. అనంతరం పరిణామాలతో కుమారుడు టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో బలమైన మైనంపల్లిని ఢీకొట్టే మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
పూర్తిగా చదవండి..Malla Reddy: మల్కాజ్గిరిలో మైనంపల్లి వర్సెస్ మల్లారెడ్డి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు హాట్హాట్గా సాగుతున్నాయి. అధికార, విపక్ష నేతలు ఢీ అంటే ఢీ అనేలా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఓవైపు అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుండగా.. మరోవైపు టికెట్ రాని అసంతృప్తులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
Translate this News: