Mahesh Babu: అది వాడడం వల్ల తలనొప్పి వచ్చేది.. అందుకే తగ్గించాను: మహేష్

తెలుగు ఇండస్ట్రీలో సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్‌లు ఎక్కువగా చేస్తున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటాడు. ఇలా ఎన్నో బ్రాండ్‌లకు ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ప్రముఖ ఫోన్ అమ్మకాల సంస్థ బిగ్ సికి కూడా ప్రమోటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

New Update
Mahesh Babu: అది వాడడం వల్ల తలనొప్పి వచ్చేది.. అందుకే తగ్గించాను: మహేష్

మహేష్ బాబు సినిమాలతో పాటు యాడ్స్‌లతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. ఖాళీ సమయం దొరికిప్పుడల్లా వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ముందుంటాడు. ఇలా ఎన్నో బ్రాండ్‌లకు ప్రమోషన్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఈ సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. ఈ సంద్భంగా ఫోన్ అతి వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉదయయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు తాను ఎక్కువగా ఫోన్ వాడుతూనే ఉంటానని తెలిపాడు. ఇలా చేయడం వల్ల తలనొప్పి వచ్చేదని.. దీంతో ఇప్పుడు వాడడం చాలా వరకు తగ్గించానని చెప్పాడు. రాత్రి 7గంటలకే ఫోన్ పక్కన పెట్టేస్తానన్నాడు. తన పిల్లలు కూడా మొబైల్‌ని బాగా వాడేస్తుంటారని పేర్కొన్నాడు. ఫోన్లు అతిగా వాడటం తగ్గించాలని అభిమానులకు సూచించాడు.

మరోవైపు ఇదే ఈవెంట్‌లో గుంటూరు కారం చిత్రంపై కూడా అప్డేట్ ఇచ్చాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా మూవీ విడుల కానుందని.. రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేశాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తొలుత ఈ మూవీలో పుజాహేగ్దేను మెయిన్‌ హీరోయిన్‌గా, శ్రీలీలను సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల పూజ మూవీ నుంచి తప్పుకుంది. దీంతో మెయిన్ హీరోయిన్‌గా శ్రీలల.. సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి లైన్‌లోకి వచ్చారు. మరోవైపు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా థమన్‌ను కూడా ఛేంజ్ చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం అని తెలిసింది. తాజాగా సినిమాలో మరో మార్పు జరిగింది. ఈ సినిమా నుంచి సినిమాటోగ్రాఫర్ డ్రాప్ అయ్యాడు. అతడి స్థానంలో స్టార్ డీవోపీ మనోజ్ పరమహంసను తీసుకున్నారు.

ఇటీవల ఈ సినిమా కోసం వర్కవుట్ చేస్తున్న ఫోటోలను మహేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చాలా రోజుల నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఏదొక కారణంతో ఎప్పటికప్పుడు షూటింగ్ వాయిదా పడుతోంది. ఇన్నాళ్లకు ఈ మూవీ కొత్త షెడ్యూల్ మొదలైంది. అన్నపూర్ణ స్టుడియోలో మహేష్‌పై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. మొత్తానికి అనుకున్న తేదికే గుంటూరు కారం సినిమా థియేటర్లలోకి రానుంది.

Advertisment
తాజా కథనాలు