Mahbubnagar: జడ్చర్లలో చంద్రయాన్ -3 వినాయకుడు

తెలంగాణ వ్యాప్తంగా వాడవాడలా గణేష్‌ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నగణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

New Update
Mahbubnagar: జడ్చర్లలో చంద్రయాన్ -3 వినాయకుడు

ఇలాంటి వింతలు విశేషాలు

తెలుగు ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలంటే జోష్ అంతా ఇంకా కాదు. ఇక గణేశుడు విగ్రహాలు మండపాలు చిత్ర విచిత్రంగా ఏర్పాటు చేస్తారు. అంతేకాదు డబ్బులతో కూడా మండపాలను అలంకరిస్తుంటారు. టీ కప్పులతో సహా వినాయకుడిని తయారు చేస్తుంటారు. ఇక గణేష్‌ మండపాన్ని సినిమా సెట్ లా తయారు చేస్తుంటారు. అయితే ఇలాంటి వింతలు విశేషాలు బాగానే జరుగుతున్నవి మనం చూస్తునే ఉంటాం. ఈ కోణంలోనే జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని శివాజీనగర్ కాలనీకి చెందిన ప్రజలకు వినూత్న ఆలోచన వచ్చింది.

ఔరా అనిపించారు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు వీర శివాజీ నగర్ కాలనీకి చెందిన కాలనీవాసులు వినూత్న ఆలోచనతో పట్టణ ప్రజల దృష్టిని తమ వినాయకుడి వైపు మరలిచారు. ఇటీవలే ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ -3ని రూపొందించి విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో ప్రపంచ దృష్టిని భారత్ వైపు మరల్చిన విషయం తెలిసిందే. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వినాయక చవితి సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని వీర శివాజీ నగర్ కాలనీలో చంద్రయాన్-3 రాకెట్ రూపొందించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ఔరా అనిపించారు కాలనీ వాసులు.

ప్రపంచంలో గర్వంగా తలెత్తుకు

అయితే ఈ విషయం తెలిసిన జడ్చర్ల పట్టణ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు కూడా భారీగా వీర శివాజీ నగర్ కాలనీకి చేరుకొని చంద్రాయన్ -3 వినాయకుడిని చూసేందుకు తరలి వస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్- 3 రూపొందించి విజయవంతంగా లాంచ్ చేసింది. ప్రపంచంలో గర్వంగా తలెత్తుకు నిలిచేలా చేసిన శాస్త్రవేత్తల శ్రమను సామాన్య దేశంలోని ప్రజలకు కూడా తెలియజేయాలని ఉద్దేశంతోనే నేడు ఈ చంద్రయాన్-3 రూపంలో వినాయకుడిని ప్రతిష్టించామని వీర శివాజీ నగర్ కాలనీ వినాయక కమిటీ సభ్యులు తెలిపారు. అంతేకాదు చంద్రయాన్- 3 వినాయకుడి నిర్వహణకు సుమారు 3 లక్షల రూపాయల ఖర్చు చేశామని నరేష్, కిషోర్, చంద్రకాంత్ వేణుగోపాల్, కరీం, రాజు, కుమార్, వెంకటేష్ వినాయక మండప నిర్వహకులు పేర్కొన్నారు.

సందడే..సందడి

వినాయక ఉత్సవాల సందర్భంగా మరోసారి చంద్రయాన్‌-3 ఖ్యాతిని తెలియజేశారు. చంద్రాయన్‌-3 వినాయకుడి ఏర్పాటే లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో చంద్రాయన్‌-3ని ఆదర్శంగా తీసుకుని వివిధ రూపాల్లో వినాయక విగ్రహాలు తయారు చేశారు. ఈ వినూత్నంగా రూపొందించే విగ్రహాలతో తెలుగు రాష్ట్రాల్లో సందడి మారింది.

Advertisment
తాజా కథనాలు