Mahabubabad: ఇంట్లో ఎంత కొట్టుకున్నా.. తిట్టుకున్నా కష్టం అని చెప్పగానే ముందుండేది తోబుట్టువులు. తల్లిదండ్రుల తర్వాత ఆడపిల్లలు అంతగా ప్రేమించేది తోబుట్టువులను మాత్రమే. వారికీ ఏదైనా కష్టం వచ్చినా, అపాయం జరిగిన క్షణం కూడా తట్టుకోలేరు అంతలా వారి పై ప్రేమను పెంచుకుంటారు. చరిత్రలో చావు తప్పా ఎవరూ విడదీయలేని బంధం అన్నాచెల్లెళ్ళ అనుబంధం. అలాంటి తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండగే రక్షాబంధన్. ఈ పండగ రోజున అక్కాచెల్లి ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా తోబుట్టువులకు రాఖీ కట్టడానికి వస్తారు.
పూర్తిగా చదవండి..Raksha Bandhan 2024: అయ్యో.. తమ్ముడికి రాఖీ కట్టి ప్రాణం విడిచిన అక్క!
రాఖీ పౌర్ణమి వేళ మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులతో పురుగుల మందు తాగిన ఓ అక్క ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తమ్ముడికి రాఖీ కట్టింది. అనంతరం గంటల వ్యవధిలోనే కన్నుమూసింది. ఈ ఘటన స్థానికంగా అందరికీ కన్నీరు పెట్టిస్తోంది.
Translate this News: