Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేష్‌కు నోటీసులు

AP: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్‌కు మరో షాక్ తగిలింది. చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసులో ఆయనకు నోటీసులు అందాయి. ఈరోజు విచారణకు తమ కార్యాలయం ఎదుట హాజరు కావాలని మంగళగిరి డీఎస్పీ నోటీసులు జారీ చేశారు.

New Update
Jogi Ramesh: జోగి రమేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Jogi Ramesh: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే ఆయన కొడుకును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయగా.. తాజాగా ఆయనకు నోటీసులు అందాయి. సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మంగళగిరి డీఎస్పీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆయనకు మంగళగిరి డీఎస్పీ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు మంగళగిరి డీఎస్పీ కార్యాలయం ముందు విచారణకు హాజరు కానున్నారు.

చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసేందుకు ఎందుకు వెళ్లారు?, దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి అని జోగి రమేష్ ను మంగళగిరి డీఎస్పీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మీతో పాటు ఎవరెవరు వచ్చారు?, మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు అనే దానిపై జోగి రమేష్ ను విచారించనున్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల వ్యవహరం కేసులో ఇప్పటికే జోగి రమేష్ తనయుడు రాజీవ్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.

ఈ వ్యవహరంలో జోగి రమేష్ తనయుడు తోపాటు భూముల కొనుగోలు చేసిన వారిని, భూములు అమ్ముటకు సహకరించిన ప్రభుత్వ అధికారుల పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు లో విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల తోపాటు దేవినేని అవినాష్, నందిగామ సురేష్.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizag Corona Cases: విశాఖలో కొత్త వేరియంట్ కరోనా కలకలం.. 14 ఏళ్ల బాలికపై అటాక్

విశాఖపట్నంలో 14ఏళ్ల బాలికకు కరోనా వైరస్ సోకింది. ఇది కొత్త వైరస్ అయిన ఒమిక్రాన్ వేరియంట్ అని వైద్యులు నిర్థారించారు. బాలికను కేజీహెచ్ ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇప్పటికే వైజాగ్‌లో మూడు కేసులు నమోదు అయ్యాయి.

New Update
visakhapatnam 14 year old girl infected with new coronavirus omicron

visakhapatnam 14 year old girl infected with new coronavirus omicron

దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రాల వారీగా రోజుకు పదుల సంఖ్యలో కేసులు పెరగడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. పరిస్థితి రోజు రోజుకూ మారిపోతుందనడానికి దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులే నిదర్శనం. ఇవాళ్టికి (జూన్ 5) దేశ వ్యాప్తంగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. 

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

దేశంలో 5వేల కేసులు . .

దాదాపు 5వేల కేసులు నేటికి నమోదు అయ్యాయి. అందులో నిన్న (జూన్4) ఒక్కరోజే 1200 కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో ఈ డేటా చూసి ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు ఏపీలోని వైజాగ్‌లో కరోనా కేసు నమోదు అయింది. అయితే ఇది కొత్త వేరియంట్ కావడంతో విశాఖ వాసులు ఆందోళన చెందతున్నారు. 

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

వైజాగ్‌కు చెందిన 14 ఏళ్ల బాలికకు కొత్త కరోనా వేరియంట్ సోకింది. ఇది ఒమిక్రాన్ వేరియంట్‌గా వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ బాలికను కేజీహెచ్ హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పటికే కొత్త ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మూడు వచ్చాయని కేజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శివానందం తెలిపారు. 

ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!

దీంతో విశాఖలో 14 ఏళ్ల బాలికకు కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌తో మొత్తం నాలుగు కేసులు నమోదు అయ్యాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. జలుబు, జ్వరం, దగ్గు వస్తే నిర్లక్ష్యం చేయవద్దని చెబుతున్నారు. .

Advertisment
Advertisment