లాడ్జిలో లవర్స్‌..ప్రియురాలు మృతి.. అసలేం జరిగిందంటే..?

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

New Update
లాడ్జిలో లవర్స్‌..ప్రియురాలు మృతి.. అసలేం జరిగిందంటే..?

Lovers Sucide in Guntur District: తెలిసీ తెలియని వయసులో ప్రేమ అంటూ యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో పరువు హత్యలు జరుగుతుండగా.. మరి కొందరూ తమను ఎక్కడ వేరు చేస్తారోనన్న భయంతో  ఆత్మహత్యకు పాల్పడుతుంటారు.  తాజాగా, పల్నాడు జిల్లాలో  ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.  ఓ లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించారు.

పిడుగురాళ్ల పట్టణంలోని కుమ్మరిపాలెంలో షేక్ షబ్బీర్ అనే వ్యక్తి  అయేషా బేగం అనే అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అయితే, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్ని నెలల పాటు వీరి ప్రేమ వ్యవహారం సాఫిగానే సాగింది. అయితే వీరి పెద్దలకు ఈ ప్రేమ వ్యవహారం తెలియడంతో ఆ యువతికి వేరుఏ వ్యక్తితో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు.

Also Read: 8 మంది ఇండియన్‌ నేవీ మాజీ సిబ్బందికి మరణ శిక్ష!

ఈ విషయం ప్రియురాలు అయేషా బేగం  షబ్బీర్ కు చెప్పడంతో తమ పెద్దలు వీరి ప్రేమ పెళ్లికి ఒప్పుకోరని భావించినట్లు తెలుస్తోంది.  వారిద్దరూ సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పట్టణంలోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. స్థానికంగా ఓ సెల్ షాప్ లో పని చేసే ఆ యువతి బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో లాడ్జికి వెళ్లినట్లు సమాచారం. అయితే సాయంత్రం ఇంటికి రాకపోవటంతో యువతి తల్లిదండ్రులు అనుమానించారు. ఆమె పని చేసే షాప్ తో సహ వారి సమీప బంధువులను కూడా అయేషా గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఆచూకీ లేక పోవటంతో చేసేది ఏమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఆమె సెల్ఫోన్ నంబరు ఆధారంగా లాడ్జిలో ఉన్నట్లు కనుగొన్నారు. పోలీసులు వెళ్లే సరికే యువతి ఉరేసుకుని విగితా జీవిగా కనిపించింది. షబ్బీర్ బ్లేడుతో శరీరంపై గాయాలు చేసుకోవడంతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ఆంజనేయులు పెర్కోన్నారు.

Advertisment
తాజా కథనాలు