Speaker Election Today : పార్లమెంట్ రెండో రోజు కూడా నినాదాలు, వాదోపవాదాలతో ముగిసింది. లోక్ సభ (Lok Sabha) లో డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ (Congress) డిమాండ్ చేయగా, బీజేపీ (BJP) దీనిపై స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లాపై అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. ఇండి కూటమి తరఫున కేరళ కు చెందిన ఎంపీ సురేష్ పోటీలో నిలిచారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభం కానుంది. ప్రొటెం స్పీకర్ సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. బీజేపీ-కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీచేశాయి. దేశంలో మొదటిసారిగా లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. దీంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పూర్తిగా చదవండి..Speaker Election : మరి కొద్దిసేపట్లో లోక్ సభ స్పీకర్ ఎన్నిక.. గెలిచేదెవరు?
భారతదేశంలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఈరోజు ఎన్నిక జరగబోతోంది. డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించకపోవడంతో.. ఇండి కూటమి నుంచి అభ్యర్థిని పోటీలో నిలబెట్టారు. అధికార ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా.. ఇండి కూటమి అభ్యర్థిగా సురేష్ పోటీలో ఉన్నారు.
Translate this News: