Congress : స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ అలర్ట్.. ఎంపీలకు విప్ జారీ!
మరికొన్ని గంటల్లో లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనున్న వేళ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఎంపీలంతా రేపు ఉదయం 11 గంటలకు సభకు హాజరుకావాలని విప్ లో పేర్కొంది. ఈ మేరకు పార్టీ చీఫ్ విప్ సురేష్ ఎంపీలకు విప్ జారీ చేశారు.