Vanteru Pratap Reddy : మెదక్(Medak) బీఆర్ఎస్(BRS) అభ్యర్థిగా ఒంటేరు ప్రతాప్రెడ్డిని(Vanteru Pratap Reddy) పోటీకి నిలపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) నిర్ణయించినట్లు తెలుస్తోంది. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు అనేక మంది పేర్లను పరీశీలించిన గులాబీ బాస్ ప్రతాప్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి. గత మూడు సార్లు కూడా ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో మరో సారి ఈ సీటును దక్కించుకోవాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్, హరీశ్ రావు ఉన్నారు.
ఇది కూడా చదవండి: Danam Nagender : టార్గెట్ దానం నాగేందర్.. యాక్షన్ మొదలుపెట్టిన బీఆర్ఎస్!
BRS : మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి ఫైనల్.. ఆ నేత వైపే కేసీఆర్ మొగ్గు?
మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వంటేరు ప్రతాప్ రెడ్డి పేరును కేసీఆర్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గత మూడు ఎన్నికల్లో ఈ సీటును గెలుచుకున్న బీఆర్ఎస్.. మరో సారి విజయం సాధించాలని కసరత్తు చేస్తోంది.
Translate this News: