Loksabha Elections 2024: సిద్దిపేటలో రఘునందన్ ఎన్నికల ప్రచారం

మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సారి బీజేపీ 400 ఎంపీ స్థానాలు గెలవడం ఖాయమన్నారు. అందులో మెదక్ నియోజకవర్గాన్ని కూడా భాగం చేయాలన్నారు.

Loksabha Elections 2024: సిద్దిపేటలో రఘునందన్ ఎన్నికల ప్రచారం
New Update

రానున్న ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పై కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఈ రోజు సిద్దిపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేటకు రైలును తీసుకువచ్చిన ఘనత కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ కే దక్కుతుందన్నారు. తాను సిద్దిపేట గడ్డపైనే పుట్టానని, ఇక్కడే చదువుకున్నానన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తన గెలుపు కోసం సిద్దిపేట నేతలు కూడా కష్టపడ్డారని గుర్తు చేశారు.

#2024-elections #bjp-raghunandan-rao
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe