TS Politics 2024 : నేను ఓడిపోతున్నా.. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండి : వినోద్ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్ లో కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటు వేయాలని చెప్పారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ పోతుందన్నారు. దేశంలో మోదీ వేవ్ ఉందని.. ఆ ప్రభావం తెలంగాణలో సైతం ఉందన్నారు.

New Update
TS Politics 2024 : నేను ఓడిపోతున్నా.. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగండి : వినోద్ సంచలన వ్యాఖ్యలు

Karimnagar : మీడియాతో చిట్‌చాట్‌లో బీఆర్ఎస్(BRS) కీలక నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌(Vinod Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోదీ(Modi) వేవ్‌ కనిపిస్తోందన్నారు. ఆ ప్రభావం తెలంగాణలోనూ ఉందన్నారు. కరీంనగర్‌ పరిధిలో కాంగ్రెస్ ఓటింగ్ బీజేపీ(BJP) కి షిఫ్ట్‌ అయిందన్నారు. కావాలంటే కరీంనగర్ వచ్చి అడగాలన్నారు. 2019లో పొన్నం ప్రభాకర్‌కి డిపాజిట్ రాలేదని గుర్తు చేశారు. ఈసారీ వెలిచాల రాజేందర్‌ రావుకు కూడా డిపాజిట్ పోతుందన్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ నాయకులే బీజేపీకి ఓటేయాలని చెప్పారని ఆరోపించారు. ఈ మేరకు తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు వినోద్ కుమార్.

Also Read : ఈ నెల 23 వరకు తెలంగాణ, ఏపీలో అతిభారీ వర్షాలు

Advertisment
తాజా కథనాలు