Rahul Gandhi: తుక్కుగూడ జనజాతర సభలో పాల్గొన్న ఎంపీ రాహుల్ గాంధీ ‘న్యాయపత్రం’ పేరుతో కాంగ్రెస్ లోక్ సభ మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలతో ఇక్కడే మేనిఫెస్టో విడుదల చేశామని.. ఈసారి కూడా ఇక్కడి నుంచే లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూ.500 లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలను అమలు చేశామని… త్వరలో దేశవ్యాప్తంగా ఈ పథకాలను అమలు చేస్తామని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. త్వరలో మరో 50 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..BREAKING: మహిళలకు ఏడాదికి లక్ష.. రాహుల్ సంచలన ప్రకటన
తుక్కుగూడ జనజాతర సభలో పాల్గొన్న ఎంపీ రాహుల్ గాంధీ 'న్యాయపత్రం' పేరుతో కాంగ్రెస్ లోక్ సభ మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఏడాదికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు. అలాగే రైతు రుణమాఫీ చేస్తామన్నారు.
Translate this News: