మణిపూర్ అంశంపై మంగళవారం కూడా పార్లమెంట్ లో ప్రతిపక్షాలు సభలను స్తంభింపజేశాయి. లోక్ సభ ప్రారంభమైన 15 నిముషాలకే వీరి నినాదాల ఫలితంగా మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టడానికి యత్నిస్తుండగానే మణిపూర్ అంశంపై విపక్ష ఎంపీలు నినాదాలు చేయడం ప్రారంభించారు. మంగళవారానికి సభలో సవరించిన లిస్టెడ్ బిజినెస్ ప్రకారం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిపాదించవలసి ఉంది. దీనిపై ఈ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఓ ప్రకటన చేయవలసి ఉంది కూడా. . ఈ ఆర్డినెన్స్ స్థానే బిల్లును ఎందుకు తేవలసి ఉందో వివరించాల్సి ఉంది. అయితే మణిపూర్ పరిస్థితిపై ప్రధాని మోదీ సభకు వచ్చి ప్రకటన చేయాలన్న తమ డిమాండును విపక్ష ఎంపీలు పునరుద్ఘాటించారు. ప్రభుత్వంపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై సాధ్యమైనంత త్వరగా చర్చ చేబట్టాలని కూడా వారు కోరారు. స్పీకర్ పలు మార్లు చేసిన విజ్ఞప్తిని పట్టించుకోకుండా వారు రభసను కొనసాగించడంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు.
పూర్తిగా చదవండి..మణిపూర్ పై అదే రభస.. పార్లమెంట్లో వాయిదాల పర్వం
మణిపూర్ అంశంపై పార్లమెంట్లో రగడ కొనసాగుతూనే ఉంది. ముగ్గురు మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించి..అందులో ఒకర్ని అత్యాచారం చేసిన ఘటనపై అధికార బీజేపీ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వంపై తామిచ్చిన అవిశ్వాస తీర్మానంపై సాధ్యమైనంత త్వరగా చర్చ చేబట్టాలని విపక్ష ఎంపీలు కోరుతుండగా..సభ పలుమార్లు వాయిదా పడింది.
Translate this News: