/rtv/media/media_files/2024/11/27/railwayplatform7.jpeg)
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ట్రాక్ల దగ్గర, ప్లాట్ఫారమ్పై పసుపు చారలు ఉండటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఈ స్ట్రిప్ను రూపొందించడం వెనుక ప్రత్యేక ప్రయోజనం ఉంది.
/rtv/media/media_files/2024/11/27/railwayplatform9.jpeg)
రైల్వే ప్లాట్ఫారమ్లోని పసుపు గీత ప్రయాణికులను అప్రమత్తం చేయడానికి, భద్రతను నిర్ధారించడానికి ఉంటుంది. రైళ్లు రాకపోకల సమయంలో ప్రయాణికులను ప్లాట్ఫారమ్కు దూరంగా ఉంచడం దీని లక్ష్యం.
/rtv/media/media_files/2024/11/27/railwayplatform5.jpeg)
ఒక ప్రయాణీకుడు ప్లాట్ఫారమ్పై నిలబడి ఉన్నప్పుడు ఈ బార్ దాటి ముందుకు వెళ్లడం ప్రమాదకరమని సూచిస్తుంది. తక్కువ దృష్టి సమస్యలు ఉన్నవారికి పసుపు గీత ప్రయోజనకరంగా ఉంటుంది.
/rtv/media/media_files/2024/11/27/railwayplatform2.jpeg)
రైలు వెళ్లే సమయంలో ప్లాట్ఫారమ్పై బలమైన గాలి వీస్తుంది. ఇది ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉంటుంది. అందుకే పసుపు గీతకు అవతలివైపు ఉండాలని అర్థం
/rtv/media/media_files/2024/11/27/railwayplatform1.jpeg)
ఈ స్ట్రిప్ రైల్వే భద్రతా ప్రమాణాలలో ఒక భాగం. దీనిని ప్రతి స్టేషన్లో ఉంచడం తప్పనిసరి. కాబట్టి ప్లాట్ఫారమ్పై ఉన్నప్పుడు కచ్చితంగా పసుపు గీత దాటి వెళ్లకూడదు.
/rtv/media/media_files/2024/11/27/railwayplatform3.jpeg)
అలాగే ప్లాట్ఫారమ్ దగ్గర కొన్ని గుర్తులు, సింబల్స్ని రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కో సిగ్నల్కు ఒక్కో హెచ్చరిక ఉంటుంది.