అరటి ఏడాది పొడవునా వస్తుంది. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చలికాలంలో అరటిపండ్లు తినాలా వద్దా అనే సందేహం అందరికీ కలుగుతుంది.
అరటిపండులో ఫైబర్స్, విటమిన్ సి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శీతాకాలంలో అంటువ్యాధులను నివారిస్తుంది. శీతాకాలంలో అరటిపండ్లు తినడం వల్ల జలుబు, దగ్గు, కఫం పెరుగుతుంది.
ఈ పండ్లు భారతదేశం నుండి కాకుండా ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల ప్రాంతాల నుండి ఉద్భవించాయని చెబుతారు. బనానా మొదటిసారిగా పాపువా న్యూ గినియాలో ఉత్పత్తి చేయబడిందని అంటున్నారు.
శాస్త్రీయంగా అరటి చెట్టు కాదు, గడ్డి, మూసా రకానికి చెందినదిగా చెబుతున్నారు. అరటి చెట్టు నాటిన తర్వాత దాని కాండం బాగా పెరుగుతుంది. ఆకులు, పండ్లు రావడానికి సమయం పడుతుంది.
చలికాలంలో జలుబు, దగ్గు లేదా గొంతు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అరటిపండ్లకు దూరంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. పిల్లలకు రాత్రిపూట అరటిపండ్లు ఇవ్వకూడదు. దీంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతారు.
అరటిపండులో ఉండే ఫైబర్, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అధిక రక్తపోటుతో బాధపడుతుంటే శీతాకాలంలో అరటిపండు తినడం మంచిది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.