కరివేపాకులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. అంటు వ్యాధుల బారి నుంచి కాపాడి ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ కరివేపాకు నీటిని తాగితే ఎలాంటి వ్యాధులు మీ దరి చేరవని నిపుణులు అంటున్నారు.
కూరలో కరివేపాకు లేనిదే రుచి రాదు.. సువాసన కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. కరివేపాకులో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
కరివేపాకు తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు ఉండవు, జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. ఇంకా చాలా వ్యాధులు నయం అవుతాయి.
ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి మన రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఉదయం కరివేపాకు నీటిని తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.
ఉదయం కరివేపాకు నీరు తాగితే కడుపు ఆరోగ్యంగా మారుతుంది. మలబద్ధకం ఉండదు, జీర్ణవ్యవస్థ బాగుపడుతుంది, చర్మ సమస్యలు కూడా పోతాయి.
గుండె ఆరోగ్యంగా మారుతుంది, కరివేపాకు వాటర్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. కరివేపాకును కూరల్లో వేసుకోవడంతో పాటు పొడి చేసుకుని తినవచ్చు, చట్నీ కూడా చేసుకోవచ్చు