Laxman Kumar Adluri: కవిత జైలుకు పోలేదా?.. కేటీఆర్ పై కాంగ్రెస్ నేత లక్ష్మణ్ ఫైర్ TG: లంచం కేసులో సీఎం రేవంత్ జైలుకు వెళ్లాడని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత లక్ష్మణ్. యావత్ తెలంగాణ తలదించుకునేలా లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్ళలేదా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పలపాలు చేసింది కేసీఆర్ కదా అని ఫైర్ అయ్యారు. By V.J Reddy 02 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Laxman Kumar Adluri: జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏక వచనంతో మాట్లాడటంపై లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు, నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మండిపడ్డారు. మొదట నీ ఇల్లు సరి చేసుకో ఎంపీ ఎన్నికల్లో నీ పార్టీ అడ్రస్ ఎక్కడో ఉందొ చూసుకో అని కేటీఆర్ ను విమర్శించారు. లక్ష్మణ్ కుమార్ కామెంట్స్.. * బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనైతికంగా ప్రవర్తించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి ఎలాంటి తాళాలు లేకుండానే చేర్చుకున్నారా? * ఉద్యమ కాలంలో ప్రజలకు బీఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలను ఎన్ని నెరవేర్చిందో కేటీఆర్ చెప్పాలన్నారు. * లంచం ఇచ్చి రేవంత్ రెడ్డి జైలుకెళ్ళినాడని కేటీఆర్ నిన్న మాట్లాడినట్లు తెలుపుతూ కౌంటర్ గా యావత్ తెలంగాణ తలదించుకునేలా లిక్కర్ స్కాంలో కవిత జైలుకు వెళ్ళలేదా? * ఆర్థికంగా మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆర్ కేటీఆర్ కదా?. #laxman-kumar-adluri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి