పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం!
తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న అభిమానులకు, తనపై విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానన్నారు.
నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ ప్రకటించడంతో పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, వెంకటేష్ సహా మరికొందరు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్స్ చేశారు.
Nandamuri Balakrishna Padma Bhushan
Jan 26, 2025 08:08 IST
పద్మ పురస్కారాల్లో తెలంగాణపై వివక్ష-సీఎం రేవంత్ రెడ్డి
పద్మ పురస్కారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన వ్యక్తులకు ఒక్కటీ రాలేదని ఆయన అసహనం తెలిపారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయాలనే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
revanth reddy Photograph: (revanth reddy )
Jan 26, 2025 08:07 IST
పద్మ అవార్డులు పొందిన తెలుగు నటులు వీళ్లే!
టాలీవుడ్ నటులకు చాలా తక్కువగా పద్మ అవార్డులు వచ్చాయి. ఎన్టీఆర్ పద్మశ్రీ-1968, అక్కినేని నాగేశ్వరరావు పద్మశ్రీ-1968, పద్మ భూషణ్-1988, పద్మ విభూషణ్-2011, క్రిష్ణ పద్మభూషణ్-2009, చిరంజీవి పద్మభూషణ్-2006, పద్మ విభూషణ్-2024, నందమూరి బాలకృష్ణ-2025.
padma awards Photograph: (padma awards)
Jan 26, 2025 08:06 IST
ఎన్టీఆర్ కొడుకు నుంచి పద్మ భూషణ్ వరకూ.. 50 ఏళ్ల బాలకృష్ణ అన్ స్టాపబుల్
బాలకృష్ణ.. ద గ్రేట్ వెండితెర వేలుపు ఎన్టీయార్ తనయుడు. పెద్ద యాక్టర్ నీడలో ఇండస్ట్రీలోకి వచ్చారు. తనకంటూ ఒక ఇమేజ్ ను సృష్టించుకున్నారు. 50 అన్ స్టాపబుల్ కెరియర్ తో దూసుకుపోతున్నారు. ఇప్పుడు పద్మభూషణ్ కూడా బాలకృష్ణను వరించింది.
Padma Vibhshan Balakrishna
Jan 26, 2025 08:05 IST
పద్మ పురస్కార గ్రహీతలకు తెలంగాణ సీఎం రేవంత్ అభినందనలు
పద్మ పురస్కారాలు లభించిన తెలుగు వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వరుసపెట్టి అందరూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాలకృష్ణో పాటూ మిగతా అదరికీ శుభాభినందనలు తెలిపారు.
Jan 26, 2025 08:02 IST
కంగ్రాట్స్ బాల బాబాయ్.. జూ.ఎన్టీఆర్ సంచలన ట్వీట్!
తన బాబాయ్కి పద్మ భూషణ్ రావడంతో జూనియర్ ఎన్టీఆర్,నందమూరి కల్యాణ్ రామ్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. బాలయ్యకు కేంద్రం తాజాగా పద్మ భూషణ్ను ప్రకటించింది. ఈ క్రమంలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వంటి వారు ట్వీట్లు వేసి తమ బాబాయ్కి కంగ్రాట్స్ తెలియజేశారు.
Balakrishna ntr
Jan 26, 2025 08:01 IST
తెలుగురాష్ఠ్రాల పద్మ అవార్డ్స్ 2025 గ్రహితలు వీరే
కేంద్రం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డ్స్ 2025ను జనవరి 25 (శనివారం) ప్రకటించింది. 113 పద్మశ్రీ, 19 పద్మ భూషణ్, 7 పద్మవిభూషణ్ మొత్తం 139 అవార్డులు అందుకోనున్న వారి వివరాలు వెల్లడించారు. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురికి పద్మ అవార్స్ ప్రకటించారు.
బాలకృష్ణకు పద్మ భూషణ్, మంద క్రిష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది.ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వరించింది. అలాగే మందక్రిష్ణ మాదిగకు పద్మ శ్రీ వచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Bala Krishna and Manda Krishna Madiga
Jan 26, 2025 07:58 IST
పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం..
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా 'పద్మ శ్రీ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వాళ్లని అవార్డులను ఎంపిక చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Padma Awards
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి