Padma AWards: బాలకృష్ణకు పద్మ భూషణ్, మంద క్రిష్ణ మాదిగకు పద్మ శ్రీ అవార్డు

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది.ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వరించింది. అలాగే మందక్రిష్ణ మాదిగకు పద్మ శ్రీ వచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Bala Krishna and Manda Krishna Madiga

Bala Krishna and Manda Krishna Madiga

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా 'పద్మ' పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వాళ్లని అవార్డులను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు వరించింది. అలాగే సామాజిక సేవా రంగంలో మందక్రిష్ణ మాదిగకు పద్మ శ్రీ వచ్చింది. కళల విభాగంలో ఆయన చేసిన కృషికి కేంద్రం ఈ అవార్డుతో సత్కరించనుంది. 113 మంది పద్మ శ్రీ, 19 మంది పద్మ భూషణ్, అలాగే ఏడుగురు పద్మ విభూషణ్‌కు ఎంపికయ్యారు. 

పద్మ విభూషణ్‌ ఎవరికంటే ?

ఎం.టి.వి.వాసుదేవన్‌ నాయర్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - కేరళ
ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) - జపాన్‌
శారదా సిన్హా (కళలు) - బిహార్‌
దువ్వూరి నాగేశ్వర్‌ రెడ్డి (వైద్యం) - తెలంగాణ
జస్టిస్‌ జగదీశ్‌ ఖేహర్‌ (రిటైర్డ్‌) (ప్రజా వ్యవహారాలు) - చండీగఢ్‌
కుముదిని రజినీకాంత్‌ లాఖియా (కళలు) - గుజరాత్‌
లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) - కర్ణాటక

పద్మభూషణ్‌ వీరికే..

నందమూరి బాలకృష్ణ (కళలు) - ఆంధ్రప్రదేశ్‌
ఎ.సూర్యప్రకాశ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - కర్ణాటక
సుశీల్‌ కుమార్‌ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - బిహార్‌
వినోద్‌ ధామ్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌) - అమెరికా
పంకజ్‌ పటేల్‌ (వాణిజ్యం, పరిశ్రమలు) - గుజరాత్‌
పంకజ్‌ ఉదాస్‌ (మరణానంతరం) (కళలు) - మహారాష్ట్ర
రామ్‌బహదుర్‌ రాయ్‌ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - ఉత్తర్‌ప్రదేశ్‌
బిబేక్‌ దెబ్రాయ్‌ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - ఎన్‌సీటీ దిల్లీ
జతిన్‌ గోస్వామి (కళలు) - అస్సాం
అనంత్‌ నాగ్‌ (కళలు) - కర్ణాటక
పీఆర్‌ శ్రీజేశ్‌ (క్రీడలు) - కేరళ
ఎస్‌.అజిత్‌ కుమార్‌ (కళలు) - తమిళనాడు
శేఖర్‌ కపూర్‌ (కళలు) - మహారాష్ట్ర
శోభన చంద్రకుమార్‌ (కళలు) - తమిళనాడు
జోస్‌ చాకో పెరియప్పురం (వైద్యం) - కేరళ
కైలాశ్‌ నాథ్‌ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) - ఎన్‌సీటీ దిల్లీ
మనోహర్‌ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర
నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) - తమిళనాడు
సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) - ఉత్తర్‌ప్రదేశ్‌

పద్మశ్రీ అవార్డులు 

మంద క్రిష్ణ మాదిగ (సామాజిక సేవ)- తెలంగాణ
సాల్లీ హోల్కర్‌ (చేనేత)- మధ్యప్రదేశ్‌
మారుతీ భుజరంగ్‌రావు చిటమ్‌పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర
బతూల్‌ బేగమ్‌ (జానపద కళాకారిణి) - రాజస్థాన్‌
వేలు ఆసన్‌ (డప్పు వాద్యకారుడు) - తమిళనాడు
హరిమన్‌ శర్మ (యాపిల్‌ సాగుదారు) - హిమాచల్‌ ప్రదేశ్‌
జుమ్దే యోమ్‌గామ్‌ గామ్లిన్‌ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్‌ ప్రదేశ్‌
విజయలక్ష్మి దేశ్‌మానే (వైద్యం)- కర్ణాటక
చైత్రం దేవ్‌చంద్‌ పవార్‌ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర
జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
జోనస్‌ మాశెట్టి  (వేదాంత గురు) - బ్రెజిల్‌
హర్వీందర్‌సింగ్‌ (పారాలింపియన్‌ గోల్డ్‌మెడల్‌ విన్నర్‌) - హర్యానా
భీమ్‌ సింగ్‌ భవేష్‌ (సోషల్‌వర్క్‌) - బిహార్‌
విలాస్‌ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) - మహారాష్ట్ర
వెంకప్ప అంబానీ సుగటేకర్‌ (జానపద గాయకుడు) - కర్ణాటక
నిర్మలా దేవి (చేతి వృత్తులు) - బిహార్‌
గోకుల్‌ చంద్ర దాస్‌ (కళలు)- పశ్చిమ బెంగాల్‌
భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) - కర్ణాటక
పర్మార్‌ లావ్జీభాయ్‌ నాగ్జీభాయ్‌ (చేనేత)- గుజరాత్
పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
ఎల్‌.హంగ్‌థింగ్‌ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్‌
బేరు సింగ్‌ చౌహాన్‌ (జానపద గాయకుడు) - మధ్యప్రదేశ్‌
షేఖా ఎ.జె. అల్ సబాహ్‌ (యోగా)- కువైట్‌
నరేన్‌ గురుంగ్‌ (జానపద గాయకుడు) - నేపాల్‌
సురేశ్‌ సోనీ (సోషల్‌వర్క్‌- పేదల వైద్యుడు)- గుజరాత్‌
రాధా బహిన్‌ భట్‌ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్‌
జగదీశ్‌ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు