AP : బీచ్‌ లో ముగ్గురు యువతుల గల్లంతు.. ఇద్దరి మృతి!

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌ లో తీవ్ర విషాదం నెలకొంది.బీచ్‌ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు...వారిలో ఇద్దరు యువతులు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

AP : బీచ్‌ లో ముగ్గురు యువతుల గల్లంతు.. ఇద్దరి మృతి!
New Update

AP Crime : ఏపీలోని అనకాపల్లి జిల్లా (Anakapalle District) అచ్యుతాపురం మండలం తంతడి బీచ్‌ (Thanthadi Beach) లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని వెళ్లిన మూడు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. బీచ్‌ లో ముగ్గురు యువతులు గల్లంతు అయ్యారు... వారిలో ఇద్దరు యువతులు చనిపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మహిళ (Woman) ను మెరుగైన చికిత్స కోసం విశాఖకు తరలించారు. ఆదివారం కావడంతో సరదాగా బీచ్ కు వెళ్లినవారికి ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. బీచ్ లో సరదాగా సెల్ఫీలు (Selfies) దిగుతుండగా కాలు జారిపడి సముద్రంలో గల్లంతు అయ్యారు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న మత్స్యకారులు కాపాడడానికి ప్రయత్నించిన అప్పటికే ఇద్దరు యువతులు మృతి చెందారు.

మృతిచెందిన ఇద్దరు కూడా అక్కా చెల్లెలుగా అధికారులు గుర్తించారు. వారు మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూక రత్నం, కనకదుర్గ గా తెలిపారు. ఈ సంఘటన గురించి పోలీసులు కేసు (Police Case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read: ఏపీలో మూడు రోజుల పాటు మందు షాపులు బంద్‌…!

#andhra-pradesh #thanthadi-beach #ladies-missing #anakapalle
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe