ముద్దు పెట్టుకున్నందుకు భర్త నాలుక కొరికేసిన భార్య

8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య ముద్దు వివాదం కలకలం రేపుతోంది. ఓ భార్య భర్త నాలుక కొరకటం ఇప్పుడు అందరిని ఆచర్యానికి గురి చేస్తుతోంది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ నాకు నా భార్య ద్వారా ప్రాణ హాని ఉందని ఆస్పత్రిలో చికిత్సపొందున్న తారాచంద్ నాయక్ అంటున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.

New Update
ముద్దు పెట్టుకున్నందుకు భర్త నాలుక కొరికేసిన భార్య

Kurnool District A wife who bit off her husband tongue for kissing her

కర్నూలు జిల్లాలో ఓ భార్య భర్త నాలుక కొరికేసింది. భర్త ముద్దు పెట్టుకుందామని ప్రయత్నిస్తే.. భార్య రివర్స్‌లో పెద్దట్విస్ట్ ఇచ్చింది. ఈ ఘటన తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండాలో జరిగింది. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్‌కు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెందిన పుష్పవతిలు ప్రేమించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. వీరి కాపురం సజావుగా సాగింది.

తరచు గొడవలు

అవసరమైన సమయంలో తన తండ్రి కూడా నెలకు సరిపడా డబ్బులు వేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. తన భార్య ఇలా చేయడం బాధగా ఉందని కన్నీళ్లు పెట్టుకున్నాడుతారాచంద్ నాయక్. తన పిల్లల పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. అయితే తారాచంద్ తనపై దాడి చేసి తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టేందుకు వచ్చినందుకే ఇలా జరిగిందని భార్య పుష్పవతి అంటున్నారు. ఆమె కూడా తిరిగి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గత రెండు సంవత్సరాలుగా భార్యాభర్తలిద్దరు తరచుగా గొడవపడుతున్నారు.

మెరుగైన వైద్యం

ఈ రోజు ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ భార్య ఒక్కసారిగా భర్త దగ్గరకు వెళ్లి నాలుకను కొరికేసింది. తారాచంద్ నాయక్ తీవ్రంగా గాయపడగా వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం అనంతపురం పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జొన్నగిరి పోలీసులు. ఇదిలాంటే బాధితుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవల విషయంలో ఇలా జరిగిందా.. లేక తారాచంద్ భార్యను బలవంతంగా ముద్దు పెట్టుకునే క్రమంలో జరిగిందా అన్నది క్లారిటీ లేదు. ఈ ఇద్దరి వాదనల్లో ఎవరిది నిజమన్నది తేలాల్సి ఉంది. భార్యాభర్తలన్న తర్వాత చిన్న, చిన్న గొడవలు మామూలే.. కానీ ఇలా నాలుక కొరికన ఘటన మాత్రం స్థానికంగా చర్చనీయాంశమైంది.

ప్రాణహాని ఉంది

తన భార్యను దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తే ఇలా నాలుక కొరికేసినట్లు బాధితుడు తారాచంద్ నాయక్ ఆరోపించారు. భార్య ప్రవర్తన కొంతకాలంగా సరిగా లేదని అదే ఊరిలో మరో వ్యక్తితో సన్నిహితంగా ఉందని చెప్పుకొచ్చాడు. తన భార్య నుంచి ప్రాణహాని ఉందని తనను చంపేస్తుందేమోనని భయంగా ఉందన్నాడు. తన భార్యను చాలా బాగా చూసుకుంటున్నానని షాపులో పనిచేస్తూ నెలకాగానే జీతం డబ్బులు భార్యకే తెచ్చి ఇస్తున్నట్లు చెబుతున్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు